India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.
AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.
జానీ మాస్టర్ కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని మనోజ్ సూచించారు.
సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 11, 12, 13 తేదీల్లో రెగ్యులర్ రైళ్ల టికెట్లన్నీ అమ్ముడవ్వగా వెయిటింగ్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. ఈ వెయిటింగ్ లిస్ట్ను ఫిల్ చేసేందుకు అదనపు కోచ్లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దీని బట్టి పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్లో పాల్గొంటున్నారు.
AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం <<14134836>>వ్యాఖ్యలను<<>> టీటీడీ మాజీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని పునరుద్ఘాటించారు. లడ్డూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
JKలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో తాము కూడా కాంగ్రెస్-ఎన్సీ వైఖరితోనే ఉన్నామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. JKలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణలో వారిది, తమది ఒకే వైఖరి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్కడా ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని చెప్పలేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండడం గమనార్హం.
ఉత్తర్ప్రదేశ్లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.
ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.