India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతులకు రుణమాఫీ చేసినా వారి బాధలు తీరడం లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా కుటుంబంలోని ఇద్దరు నైపుణ్యాలు పెంచుకుని పరిశ్రమలు పెట్టాలి. యువతకు అన్నివిధాలా చేయూతనిస్తాం. గతంలో కృష్ణా జిల్లాలో ఎకరం అమ్మితే TGలో పది ఎకరాలు వచ్చేది. ఇప్పుడు TGలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో పదెకరాలు వస్తుంది. పరిపాలనలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధిని కొనసాగిస్తాం’ అని తెలిపారు.
మూవీ లవర్స్కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న రూ.99కే మల్టీప్లెక్స్ల్లో సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్స్పై ఆఫర్ వర్తిస్తుంది. PVR ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీ టైమ్, డిలైట్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ కేటగిరీలకు వర్తించదు.
AP: YCPకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం YS జగన్కు లేఖ రాశారు. ‘రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించా. రాజకీయ నాయకులు భాషా గౌరవం కాపాడాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. విలువలు నమ్ముకుని 5సార్లు MLA, 2సార్లు మంత్రిగా పని చేశానన్న కొంత తృప్తి, కొంత గర్వంగా కూడా ఉంది. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం’ అని ఆయన పేర్కొన్నారు.
ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంలో కీలకంగా ఆడిన భారత ప్లేయర్ జుగ్రాజ్ సింగ్ను నెటిజన్లు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన జుగ్రాజ్ వాఘా బోర్డర్లో తన సోదరుడితో కలిసి పర్యాటకులకు వాటర్ బాటిల్స్ అమ్మేవారు. ఆర్థికంగా ఎన్నో ఆటంకాలున్నప్పటికీ వాటిని అధిగమించి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. నిన్న చైనాతో జరిగిన మ్యాచ్లో ఆయన కొట్టిన గోల్ వల్ల ఇండియా ట్రోఫీని గెలుపొందింది.
AP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్కు బాలినేని పంపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్తో భేటీ అనంతరం కూడా బెట్టు వీడలేదు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానున్న బాలినేని జనసేనలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు.
TG: అత్యాచారం కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఫోన్కు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లద్దాక్లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు బృందాలు ఆయన కోసం అక్కడకు బయల్దేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులనూ సంప్రదించారు.
లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
ఐపీఎల్లో వచ్చే సీజన్కు తమ కొత్త కోచ్గా రికీ పాంటింగ్ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా పనిచేశారు.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్కు రికీ పాంటింగ్ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిటైర్మెంట్ అంటే జోక్గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.