India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.
AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్కు, ఈనెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న HYDలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.
రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేయవచ్చు.
TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.
TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.
AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.
జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఇలా వేధింపులు ఎదుర్కొన్నవారు తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. హైదరాబాద్లోని TFCC ఆఫీస్ వద్ద ఉ.6 నుంచి రా.8 వరకు కంప్లైంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పోస్ట్ లేదా ఫోన్ 9849972280, మెయిల్ ఐడీ complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
Sorry, no posts matched your criteria.