news

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

image

1994 నుంచి బాలాపూర్ <<14121640>>లడ్డూ<<>> వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్కూల్, రోడ్లు, ఆలయాల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగించారు. దేని కోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.

News September 17, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన వైఎస్ సునీత

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా హత్య కేసును విచారించిన అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌‌తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారని సునీత ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రపూరితంగా వ్యవహరించారని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని సునీత కోరారు.

News September 17, 2024

మయన్మార్‌లో ‘యాగీ’ బీభత్సం.. 236 మంది మృతి

image

మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో 236 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 77 మంది గల్లంతైనట్లు చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 6.31 లక్షల మంది వరదలకు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.

News September 17, 2024

ఉమెన్స్ టీమ్ ప్రైజ్‌మనీ.. ICC సంచలన నిర్ణయం

image

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల టీమ్‌తో సమానంగా T20 వరల్డ్ కప్ ఉమెన్స్ టీమ్‌కు ప్రైజ్ మనీ ఇవ్వనుంది. విజేత జట్టుకు 2.34 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇది గతేడాది ప్రైజ్‌మనీ(1 మి.డాలర్లు) కంటే 134% ఎక్కువ. రన్నరప్ టీమ్‌కు 1.17 మి.డాలర్లు(గతంలో 5,00,000 డాలర్లు), సెమీ ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు 6,75,000 డాలర్లు ఇవ్వనుంది. కాగా OCT 3 నుంచి UAEలో మహిళల T20 WC జరగనుంది.

News September 17, 2024

ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా

image

ఢిల్లీ సీఎం పదవికి అర‌వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న రాజ్ భవన్‌లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌ల‌సి రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. వారం రోజుల్లో ఆతిశీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అప్పటివరకు కేజ్రీవాల్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.

News September 17, 2024

రేపు ఉదయంలోగా నిమజ్జనాలు పూర్తి: సీపీ

image

TG: హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాలు కాకుండా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. అటు నిమజ్జన ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సీవీ ఆనంద్ హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.

News September 17, 2024

‘బిగ్ బాస్’ ఫేమ్ సోహెల్‌ తల్లి కన్నుమూత

image

‘బిగ్ బాస్’ ఫేమ్, సినీ నటుడు సోహెల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆయన తల్లి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోహెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి. దీంతో ఆమె పార్థీవదేహాన్ని స్వస్థలానికి తరలించారు. ‘కొత్త బంగారు లోకం’తో సోహెల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

News September 17, 2024

త్రివిక్రమ్‌ను ప్రశ్నించండి: పూనమ్

image

జానీ మాస్టర్‌పై రేప్ కేసు నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అప్పుడే అతడిపై “మా” చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు. త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

Stock Market: ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్తప‌డ్డారు

image

US ఫెడ్ వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు ఊహాగానాల నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య క‌న్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వ‌ద్ద నిలిచింది. హీరో మోటార్స్‌, బ‌జాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.

News September 17, 2024

మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు!

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ మహిళా లాయర్లపై యాసిడ్ పోస్తామని, రేప్ చేస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.