India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మందుల కిట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు మందుల మీద ఎక్కడా జగన్ రెడ్డి బొమ్మ లేదు’ అని పేర్కొంది.
CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.
బెంచ్మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. కొనుగోళ్లలో దూకుడు ప్రదర్శించడం లేదు. సెన్సెక్స్ 82,915 (-78), నిఫ్టీ 25,366 (-16) వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 25:25గా ఉంది. HDFC బ్యాంకు, ఎయిర్టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బ్రిటానియా, దివిస్ ల్యాబ్, LTIM, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్.
TG: కొత్త రేషన్ కార్డుల <<14116390>>దరఖాస్తులకు<<>> వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే AP, TN, KA, గుజరాత్లో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలనుకుంటున్న రాహుల్ గాంధీకి జిన్నా తరహా మైండ్సెట్ ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ USలో విమర్శించారు. ‘భారత్లో రాహుల్ సిక్కుల గురించి మాట్లాడరు. ఎవరి హయాంలో, ఎందుకు వారిపై ఊచకోత జరిగిందో ఆయన అంతర్మథనం చేసుకోవాలి. కోరుకున్నది దక్కాలి లేదా నాశనమవ్వాలన్న జిన్నా వైఖరే ఆయనకుంది. ఓ పద్ధతి ప్రకారం ఆయన సిక్కులపై కుటిల యత్నానికి పాల్పడుతున్నారు’ అని అన్నారు.
TG: NEP-2020లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యావిధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 365 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. 90 స్థానాల్లో మొత్తం 908 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్రులే 40% ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో డివిజన్ల వారీగా కశ్మీర్లో ఐదుగురు, జమ్మూలో 2.93% పోటీలో ఉన్నారు. ఓట్లను చీల్చి గెలిచేందుకు BJP వీళ్లకు స్పాన్సర్ చేస్తోందని NC, PDP, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 831 మంది పోటీచేయగా అందులో 274 మంది ఇండిపెండెంట్లు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు అందించాలని వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. మీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి, శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది’ అని పవన్ ట్వీట్ చేశారు.
AP: YCP అధినేత జగన్ MLAగా ఉన్న పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు TDP వెల్లడించింది. ‘రేపు పులివెందుల గాంధీ సర్కిల్, 4రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేష బుద్ధి చూపిస్తున్న పులివెందుల MLA కూడా రావచ్చు. ప్రజలు కడుపునిండా అన్నం తినటం రెండు కళ్లతో చూడలేనని అనుకుంటే, బెంగళూరు ప్యాలెస్లోనే ఉండిపోవచ్చు’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.