news

News September 16, 2024

సూఫీ మందిరాలపై దాడులు.. బంగ్లాలో కలకలం

image

బంగ్లాదేశ్‌లో వర్గ వైషమ్యాలు తగ్గడం లేదు. కొన్నాళ్ల కిందట చెలరేగిన హింసలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. భారత స్నేహ చిహ్నాలను బద్దలుకొట్టారు. తాజాగా సూఫీ మందిరాలు, స్థలాలపై దుండుగులు దాడులు చేస్తుండటంతో ఆ వర్గంవారే సొంతంగా భద్రతను చూసుకుంటున్నారు. రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ఉర్సు నిర్వహిస్తుండగా నిన్న రాత్రి సిలెట్‌లో హజ్రత్ షా పరన్‌ కట్టడంపై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

News September 16, 2024

ఉత్తమ్ అధ్యక్షతన నేడు 2 క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలు

image

TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన HYD జలసౌధలో ఇవాళ రెండు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఉత్తమ్ ఛైర్మన్‌గా ఉన్న రేషన్-హెల్త్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. రేషన్, హెల్త్ కార్డులపై రాజకీయ పార్టీలు, MLAల నుంచి వచ్చిన సిఫార్సులు, విధివిధానాలపై మ.2 గంటలకు, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 4 గంటలకు చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

News September 16, 2024

‘దేవర’ కథ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్

image

‘దేవర’ సినిమా 1980-1990 మధ్య కాలంలో జరిగే కథ అని డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఇది రెగ్యులర్ హీరో-విలన్ ఫిల్మ్ కాదని అన్నారు. ఒకే ఫ్యామిలీలోని సభ్యుల మధ్య రిలేషన్‌షిప్స్ గురించే ఈ సినిమా ఉంటుందన్నారు. ఇది యాక్షన్ డ్రామా మూవీ అని హీరో ఎన్టీఆర్ తెలిపారు. ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

News September 16, 2024

రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్

image

TG: కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ₹1.5లక్షలు, పట్టణాల్లో ₹2లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలన్నారు.

News September 16, 2024

ఎల్లుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

image

AP: పౌర్ణమి సందర్భంగా ఈ నెల 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5.55 గంటలకు కామథేను ఆలయం నుంచి కుమ్మరిపాలెం, 4 స్థంభాలు, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, రథం సెంటర్ మీదుగా మహామండపం వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఇటీవల ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.

News September 16, 2024

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?

image

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News September 16, 2024

తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే వందే మెట్రో?

image

దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు(అహ్మదాబాద్-భుజ్)ను ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. త్వరలోనే చెన్నై-తిరుపతి, సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. 100 నుంచి 350KM దూరమున్న నగరాల మధ్య 100KM వేగంతో నడిచేలా ఈ AC రైళ్లు రూపొందించారు. రిజర్వేషన్ ఉండదు. నేరుగా టికెట్ తీసుకుని ఎక్కాలి. 16 కోచ్‌ల రైలులో 1150 మంది కూర్చొని, 2058 మంది నిలబడి ప్రయాణించవచ్చు.

News September 16, 2024

డిస్కౌంట్లతో పండగ సేల్స్‌లో ‘పవర్ ప్లే’

image

భారీ డిస్కౌంట్లతో ఓనమ్, వినాయక చవితికి కార్లు, బైకులు, ఫ్రిజ్‌లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సేల్స్ బాగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ ఇలాగే ఉంటే దీపావళి నాటికి సేల్స్ మరింత పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో మారుతీ బుకింగ్స్ 10% పెరిగాయి. కేరళలో టూవీలర్ సేల్స్ నిరుటితో పోలిస్తే 8% పెరిగాయి. ఫ్రిజులు 15%, వాషింగ్ మెషీన్లు 13% ఎక్కువ సేల్ అయ్యాయి.

News September 16, 2024

ఈనెల 22న అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

image

AP: టెట్ హాల్ టికెట్లు ఈనెల 22 నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది హాజరుకానున్నారు. ఈనెల 19 నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 4 తర్వాత నుంచి ప్రైమరీ ‘కీ’లను విడుదల చేసి, 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ కీ, నవంబర్ 2న తుది ఫలితాలు ప్రకటిస్తారు.

News September 16, 2024

ప్రయాణికులకు ‘సంక్రాంతి’ కష్టాలు.. 4 నెలల ముందే టికెట్లు క్లోజ్

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు కష్టాలు తప్పేలాలేవు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ అయిపోయాయి. గౌతమి, కోణార్క్, సింహపురి, గరీబ్‌రథ్, ఫలక్‌నుమా, గోదావరి, శబరి, LTT విశాఖ, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఆ పరిమితి కూడా దాటి రిగ్రెట్ కనిపిస్తోంది. ముందుగానే ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.