news

News June 18, 2024

నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను: రవూఫ్

image

ఎవరైనా హద్దులు దాటి తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని పాకిస్థాన్ క్రికెటర్ <<13462747>>హారిస్<<>> రవూఫ్ హెచ్చరించారు. అమెరికాలోని ఓ హోటల్‌లో జరిగిన గొడవపై రవూఫ్ స్పందించారు. ‘ఈ గొడవను సోషల్ మీడియా వరకు తీసుకురావద్దని అనుకున్నా. కానీ తప్పక స్పందిస్తున్నాను. ఫ్యాన్స్ కొన్నిసార్లు విమర్శిస్తారు, మరి కొన్ని సార్లు ప్రశంసిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాలి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

News June 18, 2024

డ్రైనేజీల కోసం RRR రూ.5 లక్షల విరాళం.. సహకారం అందించాలని పిలుపు

image

AP: ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. అక్కడ మురుగుకాలువల బాగు కోసం కలెక్టర్ సహకారంతో “Drainage Maintenance Infrastructure Fund, UNDI” పేరుతో ప్రత్యేక ఖాతాను తెరిపించానని చెప్పారు. ఈ నిధికి తొలి విరాళంగా రూ.5 లక్షలు ఇచ్చానని, ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని RRR కోరారు.

News June 18, 2024

జూ.కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్

image

AP: ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి. ఇకపై వాటితోపాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లనూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. KGBVలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్‌లలో చదివే స్టూడెంట్లకూ తెలుగు అకాడమీ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News June 18, 2024

ఇది సర్.. ధోనీ రేంజ్!

image

భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న FIFA ఇన్‌స్టాలో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫొటోను షేర్ చేస్తూ ‘తలా ఫర్ ఏ రీజన్ 7’ అని రాసుకొచ్చింది. ధోనీని అభిమానులు ‘తలా’ అని పిలుస్తారని తెలిసిందే. కాగా ఏకంగా FIFA అలా పోస్టు చేయడంతో ‘ధోనీ రేంజ్ ఇది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News June 18, 2024

సర్టిఫికెట్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిపై ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులిచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, HODలకు స్పష్టం చేసింది.

News June 18, 2024

దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించండి: టీటీడీ ఈవో

image

TTD ఈవో జే.శ్యామలారావు అధికారులకు కీలక సూచనలు చేశారు. కాలినడక భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. APSRTC, టూరిజం కోటా దర్శన టికెట్లు నిరుపయోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కచ్చితమైన దర్శన సమయాలు తెలిసేలా నారాయణగిరి షెడ్ల వద్ద ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

News June 18, 2024

గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

AP: పార్వతీపురం మన్యం జిల్లా సోమినాయుడువలస గేటు వద్ద గూడ్స్ రైలు నుంచి నాలుగు బోగీలు విడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేశారు. కాసేపటికి మరమ్మతులు చేసి రైలును అక్కడి నుంచి పంపించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

News June 18, 2024

మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు

image

AP: నూతన మంత్రివర్గ సభ్యులకు సచివాలయంలో ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. బ్లాక్-2లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ సహా ఏడుగురికి ఛాంబర్లు అప్పగించింది. బ్లాక్-3లో ఐదుగురు, బ్లాక్-4లో ఎనిమిది మంది, బ్లాక్-5లో ఐదుగురికి కేటాయించింది.

News June 18, 2024

12వ PRC కమిషనర్ మన్మోహన్ రాజీనామా

image

AP: రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(PRC) కమిషనర్ మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలంటూ సీఎస్ నీరభ్ కుమార్‌కు లేఖను పంపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈయనను ప్రభుత్వం 2023 జులైలో పీఆర్సీ కమిషనర్‌గా నియమించింది.

News June 18, 2024

ఎల్లుండి భారత హెడ్ కోచ్ ప్రకటన?

image

టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్‌ పేరును BCCI ఎల్లుండి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ KKR మెంటార్ గౌతమ్ గంభీర్‌ను BCCI ఇంటర్వ్యూ చేసింది. ఆయనతోపాటు WV రామన్‌నూ ప్రశ్నించింది. రేపు ఓ విదేశీయుడితోపాటు గంభీర్‌ను మరోసారి ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. అనంతరం షార్ట్ లిస్ట్ చేసి కోచ్ పేరును ప్రకటించనుంది. వీరు ముగ్గురూ పోటీలో ఉన్నా గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.