news

News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక MLA పల్లా శ్రీనివాసురావు యాదవ్‌ని చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నూతన బాధ్యతలను శ్రీనివాసరావు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో గాజువాక నుంచి గెలుపొందారు.

News June 16, 2024

ఐర్లాండ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్

image

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమైంది. డెలానీ(31), లిటిల్(22) ఫరవాలేదనిపించారు. మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్ బౌలర్లలో అఫ్రిది 3, ఇమాద్ 3, అమిర్ 2, రవూఫ్ 1 వికెట్ చొప్పున తీశారు. పాక్ గెలవాలంటే 107 రన్స్ చేయాలి. ఈ రెండు జట్లు ఇప్పటికే సూపర్8 రేసు నుంచి నిష్క్రమించాయి.

News June 16, 2024

మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్

image

‘చివరికి దేవుడిని కలిసే అవకాశం పోప్‌కి వచ్చింది!’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్ వేసింది. ఇటలీ పర్యటనలో భాగంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. అప్పుడు తీసిన ఫొటోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఒడిశా బీజేపీ నేత సంబిత్ పాత్ర ‘పూరీ జగన్నాథుడు కూడా మోదీకి భక్తుడే’ అని వ్యాఖ్యానించడాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

News June 16, 2024

ఏకపక్షంగా విగ్రహాలు తరలించారు: ఖర్గే

image

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ప్రముఖుల విగ్రహాల తరలింపును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుబట్టారు. ‘గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తొలగించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే. ఎన్నో చర్చలు, పరిశీలన తర్వాత అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇప్పుడు ఒక మూలకు మార్చారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మన పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 16, 2024

కాంగ్రెస్‌ చీఫ్‌ను కలిసిన బీజేపీ మంత్రి

image

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఇంటికి వెళ్లి కలిశారు. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. జూలై 22న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News June 16, 2024

అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత

image

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని భావిస్తోంది. J&Kపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు తరలించి కూంబింగ్ వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

News June 16, 2024

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

image

AP: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని CM పిలుపునిచ్చారు.

News June 16, 2024

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలోని ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాత్రి 8 గంటలకు విడుదల చేయాల్సిన ఈ పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొంచెం ఓపిక పట్టాలని అభిమానులను కోరింది. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఆలపించగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

News June 16, 2024

టికెటింగ్ బిజినెస్‌లోకి జొమాటో?

image

పేటీఎం సినిమా, ఈవెంట్స్ టికెట్ సేల్స్ కోసం జొమాటోను వేదికగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈమేరకు టికెటింగ్ బిజినెస్‌లోకి జొమాటోను ఆహ్వానించిందట. గత నెలలో పేటీఎం సేల్స్ క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ రూ.1,500కోట్లు అని తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే జొమాటో చరిత్రలో రెండో అతి పెద్ద డీల్‌గా నిలుస్తుంది. 2021లో బ్లింకిట్‌ను రూ. 4,447 కోట్లకు కొనుగోలు చేసింది.

News June 16, 2024

సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్

image

తొలి వన్డేలో సౌతాఫ్రికా మహిళల జట్టును భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 266 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 37.4ఓవర్లలోనే కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (117) సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో ఆశా శోభన 4 వికెట్లతో పర్యాటక సౌతాఫ్రికా నడ్డి విరిచారు. దీంతో 143 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచింది.