India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీప్ఫేక్ వీడియోలు సినీ తారలనే కాదు.. దేశాధినేతలనూ వదలడం లేదు. ఇటీవల ఇటలీ PM జార్జియా మెలోని డీప్ఫేక్ పోర్న్ వీడియోలు ఆన్లైన్లో వైరలయ్యాయి. మెలోని ఫేస్తో వీడియోలు సృష్టించిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై PM రూ.91 లక్షల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె జులై 2న కోర్టు ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కాగా మన దేశంలో రష్మిక డీప్ఫేక్ వీడియో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ, రాజస్థాన్, హరియాణాకు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి, కో-ఇన్ఛార్జీలను నియమించింది. ఏపీ ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కో-ఇన్ఛార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ను నియమించింది. రాజస్థాన్కు వినయ్, విజయా, ప్రవేశ్ వర్మను, హరియాణాకు సతీశ్ పూనియా, సురేంద్ర సింహ్ నాగర్ను నియమించింది.
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేరుతో ఓ న్యూస్ వైరలవుతోంది. ‘ఎన్నికల కమిషనర్ నిర్ణయం.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు కనబడితే వెంటనే ఫొటో లేదా వీడియో తీసి 9676692888కు వాట్సాప్ చేయండి’ అని అందులో ఉంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని APCEO ట్వీట్ చేశారు.
హీరోయిన్ అమలాపాల్ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘2 హ్యాపీ కిడ్స్’ అని పేర్కొంటూ ఇన్స్టాగ్రామ్లో ఆమె రెండు లవ్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఓ పాపను ఎత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. జగత్ దేశాయ్ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె.. తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
నీటి ఎద్దడితో బెంగళూరులో IPL మ్యాచ్ల నిర్వహణ ప్రశ్నార్థకమైన వేళ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వేస్ట్ వాటర్ ప్లాంట్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు నీటిని సరఫరా చేయనుంది. మ్యాచ్ జరిగే రోజు సగటున 75వేల లీటర్ల నీరు అవసరమట. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
AP రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితులు పూర్తిగా హీటెక్కాయి. పవన్ ఎంపీగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై YCP స్పందించింది. ‘జాగ్రత్త పవన్. ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీనే అనుకుంటా. చూస్కో మరి’ అని Xలో పోస్ట్ చేసింది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ 2 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. జనసేన ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా, తమ పార్టీ కోరుతున్న స్థానాలపై ఇద్దరు సమీక్షిస్తున్నారు. అటు త్వరలోనే జనసేన మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.
AP: 2018 గ్రూప్-1 మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఇటీవల మెయిన్స్ను హైకోర్టు రద్దు చేసింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ APPSC డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
రేపు జరిగే IPL తొలి మ్యాచ్ కోసం RCB ప్లేయర్లు చెన్నై స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, నిన్న నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీని గ్లెన్ మ్యాక్స్వెల్ ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2013IPLలో మ్యాక్స్వెల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ను అచ్చం ఇలానే ఇమిటేట్ చేశారని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.