India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మంగళవారం వెలువడిన ఫలితాల్లో అరకు లోక్సభ స్థానానికి ఏకంగా 50,470 ‘నోటా’ ఓట్లు పడ్డట్లు తేలింది. ఇవి అక్కడ పోలైన ఓట్లలో 4.33శాతం కాగా నోటాకు అత్యధికంగా వచ్చిన ఓట్లలో దేశంలోనే అరకు రెండో స్థానంలో నిలిచింది. 2,18,674 ఓట్లతో మధ్యప్రదేశ్లోని ఇండోర్ తొలి స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో అత్యల్పంగా విశాఖ లోక్సభ స్థానానికి 5,313 నోటా ఓట్లు పడ్డాయి.
పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది.
NDA కూటమిలో ఇద్దరు MPలు ఒకప్పుడు ఓ సినిమాలో హీరో-హీరోయిన్గా చేశారు. ఒకరు తొలిసారి MPగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్. మరొకరు లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాస్వాన్. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’లో జంటగా నటించారు. అయితే అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంగనా సినిమాల్లో సత్తా చాటి రాజకీయాల్లోకి రాగా, పాస్వాన్ ఈ ఎన్నికల్లో తన పార్టీకి 100% <<13389049>>స్ట్రైక్రేట్<<>> అందించి సక్సెస్ అందుకున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈరోజు AP, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. APలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నాయి. TGలో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించాయి.
AP అసెంబ్లీ స్పీకర్గా ఎవరు నియమితులవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణ రాజు తనకు ఈ పదవి కావాలని TDP అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు నెల్లూరు(D) ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. CMగా CBN ప్రమాణ స్వీకారం అనంతరం దీనిపై స్పష్టత రానుంది.
USA జట్టులో ఉన్న <<13394153>>సౌరభ్ నేత్రావల్కర్<<>> మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఈయన ICC U-19 WC 2010లో భారత్ తరఫున ఆడారు. 2013లో కర్ణాటకతో జరిగిన రంజీ గేమ్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. 2018లో USA జట్టుకి ఎంపికై 2019లో కెప్టెన్ అయ్యారు. 2022 జింబాబ్వేలో జరిగిన ICC మెన్స్ T20 WC గ్లోబల్ క్వాలిఫయర్ B టోర్నమెంట్లో మ్యాచ్లో USA తరఫున 5 వికెట్లు తీసి సత్తా చాటారు.
AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు <<13390605>>తెరపైకి<<>> వచ్చింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆయన నియామకంపై ఇవాళ జీవో రావొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత CS జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
TG: లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడంపై BRS సమాలోచనల్లో పడింది. KCR బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలోకి బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టొద్దంటూ అధినేతకు అనుచరులు సూచిస్తున్నారట. దీంతో ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
TG: వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నియామకాల ప్రక్రియ వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు(MHSRB) ద్వారా జరగనుంది. ఈ రిక్రూట్మెంట్లో డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వంటి పోస్టులున్నాయి.
AP: నిన్న TDP MPలతో చంద్రబాబు భేటీలో ఆసక్తికర ఘటన జరిగింది. కార్యకర్త స్థాయి నుంచి విజయనగరం MPగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడిని CBN అభినందించారు. ‘ఢిల్లీకి రావడానికి విమాన టికెట్ ఉందా అప్పలనాయుడు? లేకపోతే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అని CBN అడగటంపై మిగతా MPలు భావోద్వేగానికి గురయ్యారు. అతని స్థితిగతులు తెలుసుకోవడం, విమాన టికెట్ గురించి ఆరా తీయడం వారిని కదిలించింది.
Sorry, no posts matched your criteria.