India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎల్లుండి రాత్రి 7.15 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు రానుండటంతో 2,500 మంది పోలీసులతోపాటు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.
తెలంగాణలో BRS స్థానాన్ని భర్తీ చేసేందుకు TDP ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓటమితో కారు పార్టీ డీలాపడగా.. తెలంగాణలో బలపడేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలు TDPతోనే ఉన్నందున BRSలోని కొంతమంది నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు టాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని TDP నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీకి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ పీటర్సన్ అభినందనలు తెలిపారు. మూడోసారి ప్రధాని కానున్న ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ హిందీలో ట్వీట్ చేశారు. ‘భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అది గమనిస్తున్నా. అద్భుతం’ అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘అఖండ 2’ మూవీపై ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను హిందూపురంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందట. షూటింగ్ కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలించినట్లు టాక్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.
ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నేతలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీశారు. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.
ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని 29 MP స్థానాలనూ గెలుచుకుని BJP రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొత్తం 369 మంది పోటీ చేయగా 311 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇండోర్లో బీజేపీ నేత శంకర్ లల్వానీ రికార్డు స్థాయిలో 11.75 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అన్ని చోట్లా నాయకులు లక్ష నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
టాలీవుడ్ హీరోయిన్ సునయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, రింగులు మార్చుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త ఎవరనేది బయటపెట్టలేదు. కుమార్VSకుమారి, టెన్త్ క్లాస్, రాజ రాజ చోర తదితర తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో సునయన నటించారు. ఇన్స్పెక్టర్ రిషి, మీట్ క్యూట్, చదరంగం వెబ్సిరీస్లలోనూ కీలక పాత్రలు పోషించారు.
పార్టీలను చీల్చిన వారికి, CMలను జైలులో పెట్టిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఛత్తీస్గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. INC కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మహారాష్ట్ర డిప్యూటీ CM ఫడ్నవీస్ రిజైన్ చేయబోతున్నారు. UPలో యోగి కుర్చీ షేక్ అవుతోంది. రాజస్థాన్ CM భజన్ లాల్ ఊగిసలాడుతున్నారు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.