India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించినట్లు టాక్. 43 ఏళ్ల కరీనా ఈ మూవీతో సౌత్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మూవీని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.
* బీజేపీకి అధికారమిస్తే TGను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ
* TG: గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
* దళిత బంధుతో ఎదురుదెబ్బ: కేసీఆర్
* BRSలో చేరిన ప్రవీణ్ కుమార్
* AP: అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: జగన్
* జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డారు: CBN
* ‘ప్రజాగళం’ పూర్తిగా విఫలం: సజ్జల
* లిక్కర్ స్కామ్లో 15 మంది అరెస్టు: ఈడీ
గ్లాకోమా.. కంటి జబ్బుల్లో అత్యంత ప్రమాదకరమని, కంటిచూపును క్షీణింపజేస్తూ చివరికి శాశ్వత అంధత్వాన్ని తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. గ్లాకోమా సంకేతాలు, లక్షణాలు ఉంటే వెంటనే తొలి దశలోనే చికిత్స చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తరచూ ఎరుపు రంగులోకి మారడం, తరచూ కళ్లద్దాలు మార్చాల్సి రావడం, కంటి నొప్పి వంటివి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని కోరింది.
ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్తో పాటు దుబాయ్లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
RRR సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి జపాన్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా జపాన్లో ఓ వృద్ధురాలు రాజమౌళి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్లో తెలియజేశారు. ‘రాజమౌళి గారు.. జపాన్కు స్వాగతం. నాకు 83 ఏళ్లు. నేను RRRతో డాన్స్ చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నా’ అని బహుమతిపై ఆ ఫ్యాన్ పేర్కొన్నారు. తమకు ఇష్టమైన వారు ఆయురారోగ్యాలతో ఉండాలని జపాన్లో ఈ బహుమతులు ఇస్తుంటారు.
గత కొన్ని నెలలుగా భారతీయ రైల్వేలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనరల్ బోగీలను తగ్గించడంతో స్లీపర్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఉంటోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనివల్ల స్లీపర్ బుక్ చేసుకుని, లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నిలబడేందుకూ ప్లేస్ ఉండట్లేదని, 3ACలోనూ అదే పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లతో పాటు సామాన్యుల రైళ్లనూ పట్టించుకోవాలని కోరుతున్నారు.
చాలామంది ఛార్జింగ్ కేబుల్ పాడై, వైర్లు బయటికి వచ్చినా టేపు అంటించి వాడుతుంటారు. అలా చేయడం ప్రమాదమని UKలోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే ఫోన్ పేలిపోవడంతో పాటు మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉందట. ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. నకిలీ/తక్కువ నాణ్యత ఉన్న ఛార్జర్లు కూడా వాడటం మంచిది కాదని తెలిపింది.
ప్రపంచంలో ఎన్నో రకాల పులావ్స్ ఉన్నా ఉజ్బెకిస్థాన్ పులావ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది వయాగ్రాలా పని చేస్తుందట. ఆ దేశ జాతీయ వంటకం పులావ్. ఈవెంట్ ఏదైనా ఈ వంటకం ఉండాల్సిందే. దీన్ని యునెస్కో కూడా గుర్తించింది. ఇందులో పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే లక్షణాలున్నాయని, వయాగ్రాతో సమానమని ప్రజలు నమ్ముతారు. జీవితంలో ఒకే రోజు బతికి ఉంటామని తెలిస్తే వారు కచ్చితంగా పులావ్ తినాలని కోరుకుంటారట.
ఆర్సీబీ WPL కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాంక పాటిల్ నేషనల్ క్రష్గా మారారు. నెట్టింట ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఫైనల్లో 4 వికెట్లు తీసిన పాటిల్, సీజన్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 21 ఏళ్ల శ్రేయాంక బెంగళూరు బాలికే. కర్ణాటక తరఫున ఆడుతున్నారు. గత ఏడాది భారత జట్టులోకీ ప్రవేశించిన ఆమె, మున్ముందు మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంది.
UKకు చెందిన 3ఏళ్ల బాలిక వింటర్ ఆటిజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తోంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడల ప్లాస్టర్ వంటివి ఆహారంగా తింటోంది. నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తోందని.. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లు మొత్తం తినేస్తోందని తల్లి స్టేసీ తెలిపారు. ఎప్పుడూ తినకూడని వస్తువులు తినేందుకు తహతహలాడుతుంటుందని చెప్పారు. బాలికకు 13 నెలల వయసు నుంచి పైకా వ్యాధి ప్రారంభమైందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.