India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధురంధర్ విషయంలో ఒక క్రేజీ న్యూస్ SMను ఊపేస్తోంది. సినిమా క్రెడిట్స్లో ‘ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాహుల్ గాంధీ’ అని కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సినిమా రంగంలోకి వచ్చారా? అంటూ పోస్టులతో రచ్చ చేస్తున్నారు. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత కాదు. బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ వెనకున్న సీనియర్ ప్రొడ్యూసర్. పేరు కలవడంతో వచ్చిన గందరగోళం అంతే!

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 81,666కు చేరగా నిఫ్టీ 262 పాయింట్లు ఎగిసి మళ్లీ 25వేల మార్క్కు చేరుకుంది. నిన్నటి సెషన్లో భారీ అమ్మకాలు జరగగా ఈరోజు కొనుగోళ్లు నమోదయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, బడ్జెట్లో డేటా సెంటర్లకు పన్ను మినహాయింపు వంటి ప్రకటనలు, రూపీ కోలుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 30లో పవర్గ్రిడ్ 7.55% లాభంతో టాప్ గెయినర్గా ఉంది.

సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో రాబోతున్న జైలర్-2 గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముంబయిలో జరిగే నెక్ట్స్ షెడ్యూల్లో షారుఖ్పై సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గత కొన్నిరోజులుగా క్షీణిస్తున్న రూపాయికి ఈరోజు ఊరట లభించింది. RBI జోక్యం చేసుకోవడంతో 42 పైసలు పెరిగింది. ఆరు వారాల తర్వాత మళ్లీ ఒక రోజులో ఆ స్థాయి గెయిన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుకు 91.53గా ఉంది. RBI సూచన మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి తేరుకుంది.

పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే దానికి బీజాలు ఇంట్లోనే పడాలంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. ప్రపంచాన్ని మనం మార్చలేం కానీ ఇంట్లో ఆ మార్పులు తేవచ్చంటున్నారు. ఇంటి వాతావరణం పిల్లలకు ప్రేమ పూర్వకంగా ఉండాలంటున్నారు. అదే వారి జీవితానికి ప్రతిబింబం కాబట్టి తల్లిదండ్రులు వారిపై అరవడం, నిరుత్సాహపరచడం వంటివి చేయకూడదని సూచిస్తున్నారు.

AP: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై TDP దాడులు దారుణమని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘రాష్ట్రానికి మంచి పేరుండేది. దాడులతో దాన్ని చెడగొట్టి చంద్రబాబు అప్రదిష్ఠ తెస్తూ బిహార్లా మారుస్తున్నారు. మరే పార్టీకీ కార్యకర్తలు లేరనుకుంటున్నారా? ఇది సంప్రదాయం కాదు. పోలీసులు దగ్గరుండి దాడులు చేయిస్తారా? DGP ఏం చేస్తున్నారు? ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి’ అని బొత్స కోరారు.

<

మోమోలపై ఉన్న ఇష్టంతో ఉత్తరప్రదేశ్లో 7వ తరగతి బాలుడు రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను మోసగాళ్లకు ఇచ్చేశాడు. మోమో స్టాల్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు తన కుమారుడిని మోసం చేశారని బాలుడి తండ్రి విమలేశ్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి నగలు తెస్తే, ఉచితంగా మోమో ఇస్తామని స్టాల్ యజమానులు చెప్పడంతో ఆ బాలుడు ఆభరణాలిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మహారాష్ట్ర Dy.CM, NCP చీఫ్ అజిత్ పవార్ అకాల మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు బాబాయ్ శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చీలిపోయిన NCPని మళ్లీ కలిపేందుకు కృషి చేస్తూనే బారామతి, పుణే వంటి పవార్ల కంచుకోటలపై పట్టుసడలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పవార్ ఇప్పుడు యాక్టివ్ అవడం ‘మహా’ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

రబీ సీజన్లో సాగు చేస్తున్న కుసుమ పంట పూత దశలో పేనుబంక తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ML లేదా ఎసిఫేట్ 1.5గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమను శనగపచ్చ పురుగు ఆశిస్తే దీని నివారణకు లీటరు నీటిలో క్లోరోపైరిఫాస్ 25 ఇసి 2.5ML లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
Sorry, no posts matched your criteria.