India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా DEC 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, మండల స్థాయిలో సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించనుంది.

ఇతర ఫ్రాంఛైజీల పర్స్ మనీని ఖాళీ చేయడంలో కిరణ్ కుమార్ గ్రంధి దిట్ట. GMR గ్రూప్స్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు కుమారుడైన కిరణ్ ప్రస్తుతం DC కో-ఓనర్గా ఉన్నారు. నిన్న పంత్ను లక్నో రూ.21 కోట్లకు కొనేందుకు సిద్ధమవ్వగా కిరణ్ కుమార్ RTMతో భయపెట్టి ఆ రేటును పెంచేలా చేశారు. ఫలితంగా పంత్ కోసం లక్నో రూ.27 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అలాగే స్టార్ బౌలర్ స్టార్క్ను రూ.11.75 కోట్లకే దక్కించుకున్నారు.

TG: డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనుంది.
*26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
*16 నర్సింగ్, 28 పారా-మెడికల్ కాలేజీల నిర్మాణం
*యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో క్లాసుల ప్రారంభం
*స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన
*దామరచర్లలోని 800 MW థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం
*ఏఐ సిటీకి శంకుస్థాపన, కంపెనీలతో ఒప్పందాలు

మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకడం తెలిసిందే.

శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డైరెక్టర్ RGVని ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా, తనకు సమయం కావాలని వాట్సాప్లో ఆర్జీవీ మెసేజ్ పంపారు. ఆ గడువు అయిపోగా, నేడు ఆయన్ను విచారించడానికి ఒంగోలు PSలో ఏర్పాట్లు చేశారు.

డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య, సుందర్, శార్దుల్ ఠాకూర్, ఇంగ్లిస్, దీపక్ చాహర్, ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మోయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, లూయిస్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్ etc. పూర్తి లిస్ట్ కోసం <

మహారాష్ట్రలో BJP+ కూటమి ఘన విజయంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. NSE నిఫ్టీ 300-400, BSE సెన్సెక్స్ 1500-2000 పాయింట్ల గ్యాప్అప్తో ఓపెనవుతాయని అంటున్నారు. వ్యాపార, వాణిజ్యానికి కీలకమైన MHలో BJP గెలుపు ప్రభుత్వ పాలసీల్లో సుస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్తున్నారు. గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్లు పెరగడం సానుకూల సంకేతాలు పంపిందని అంటున్నారు.

IPL హిస్టరీలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్రౌండర్గా వెంకటేశ్ అయ్యర్ నిలిచారు. అతడిని KKR ₹23.75crకు సొంతం చేసుకుంది. నిన్నటి వేలంలో అది మూడో అత్యధిక ధర. 2023లో సామ్ కరన్ ₹18.5cr(PBKS), గ్రీన్ ₹17.5cr(MI), స్టోక్స్ ₹16.25cr(CSK), 2021లో మోరిస్ ₹16.25cr(RR) ధర పలికారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యను MI ₹16.35 కోట్లకు, జడేజాను CSK ₹18 కోట్లకు, అక్షర్ పటేల్ను DC ₹16.5 కోట్లకు రిటైన్ చేసుకున్నాయి.

లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. బీరూట్లోని ఓ బిల్డింగుపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. భీకరమైన ఈ దాడుల్లో 29 మంది మరణించారు. హెజ్బొల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్, మిసైల్ యూనిట్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే 4400 యూనిట్ సహా 12 కమాండ్ సెంటర్లను నాశనం చేశామని IDF ప్రకటించింది. తమ దేశంపై టెర్రరిస్టు దాడుల ప్లానింగ్, కమాండ్, అమలుకు వీటిని వాడేవాళ్లని తెలిపింది.
Sorry, no posts matched your criteria.