India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఆ రాష్ట్ర BJP సెటైర్లు వేసింది. ఆయన వయసు 5ఏళ్లలోనే 7ఏళ్లు ఎలా పెరిగిందంటూ ప్రశ్నిస్తోంది. సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తన వయసు 42ఏళ్లుగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో 49ఏళ్లుగా వెల్లడించారు. దీంతో ఆయన వయసులో వ్యత్యాసంపై BJP ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ మూవీ మరోసారి రష్యాలో రిలీజైంది. ప్రభాస్ బర్త్ డే వీక్ సందర్భంగా అక్కడి అభిమానుల కోసం ఈ చిత్రాన్ని మరోసారి రష్యన్ భాషలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ మొదటిసారి విడుదలైనప్పుడు దాదాపు 1.64 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయదని AP హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన కూతురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదంది. ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం పేరెంట్స్ కుటుంబంలో భాగమేనని స్పష్టం చేసింది.

దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రజలకు అందుబాటు ధరలకే ఇంటర్నెట్ లభిస్తుండం దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు 1GB డేటా కోసం రూ.254 చెల్లించాల్సి వచ్చేది. అది ఇప్పుడు రూ.8కే వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్లో ఇంటర్నెట్ ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ 1GB ధర $7.29 (రూ.612). ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ($6.00), న్యూజిలాండ్ ($5.89), కెనడా ($5.37), దక్షిణ కొరియా ($5.01) ఉన్నాయి.

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలను నేటి నుంచి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) చూసుకోనుంది. గతంలో TGSP బెటాలియన్కు చెందిన సిబ్బంది సచివాలయ భద్రతను చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. BRS ప్రభుత్వం TGSPకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.

TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసేవారున్నారు. అయితే, తన భార్య నటి జ్యోతికతో తప్ప పిల్లలతో ఆయన మీడియా ముందు కనిపించరు. తాజాగా కుటుంబమంతా కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఫొటో వైరలవుతోంది. దీంతో ఈ దంపతుల పిల్లలు ఇంత ఎదిగిపోయారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. కాగా అక్కడి ఓటర్ల జాబితాను పరిశీలించగా రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల ఓటర్లు ఉంటే 100ఏళ్ల వయసు పైబడిన వారు ఏకంగా 47,392 ఉన్నట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయనున్న అత్యంత వృద్ధ ఓటర్ వయసు 109ఏళ్లు. 18-19ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 22,22,704గా ఉంది.

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, మార్కెట్కు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు 8897281111 హెల్ప్లైన్ నంబరు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాగా అకాల వర్షాలకు మార్కెట్లలో ఉన్న పత్తి తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.