news

News November 29, 2024

భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి

image

APలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా మన్యంలో చలి పంజా విసురుతోంది. గత ఏడాది NOV 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. నిన్న డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8, అరకులోయలో 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం, సాయంత్రం బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News November 29, 2024

కులగణన తర్వాత రిజర్వేషన్లలో మార్పులు!

image

TG: సమగ్ర కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉన్నందున ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవ్వగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

News November 29, 2024

BJPకే సీఎం పదవి!

image

మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మహాయుతి నేతలు శిండే, అజిత్ పవార్ అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. మరో రెండు రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఉండాలని అజిత్, శిండేలను బీజేపీ హైకమాండ్ కోరినట్లు సమాచారం. హోం, ఆర్థిక, రెవెన్యూ లాంటి కీలకశాఖలు బీజేపీకే దక్కే అవకాశం ఉంది.

News November 29, 2024

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్!

image

విద్యార్థులు తమ డిగ్రీ కోర్సును తగ్గించుకోవడం లేదా పొడిగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. చదివే సామర్థ్యం ఎక్కువ ఉన్నవారు రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేయవచ్చన్నారు. అలాగే తక్కువ సామర్థ్యం ఉన్నవారు డిగ్రీ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలతో పాటు అన్ని అర్హతలకు సంబంధించి ఇది సాధారణ డిగ్రీలాగే ఉండనుందన్నారు.

News November 29, 2024

ఉదయం లేవగానే వీటిని చూడొద్దు!

image

వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులు చూడకూడదు.
*అద్దంలో ముఖం చూసుకోవడం, జుట్టు దువ్వడం చేయకూడదు.
*పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు చూడొద్దు.
*రాత్రిపూట వదిలేసిన ఎంగిలి గిన్నెలను చూడకూడదు. రాత్రికే వాటిని శుభ్రం చేసుకోవాలి.
*అడవి జంతువులు, యుద్ధం, హింసకు సంబంధించిన పెయింటింగ్, ఫొటోలు చూడొద్దు.
>వీటిని చూస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

News November 29, 2024

సోయాబీన్ కొనుగోళ్లలో తొలి స్థానంలో తెలంగాణ

image

సోయాబీన్ కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిర్ణీత లక్ష్యంలో 74 శాతం పూర్తయినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు 1-2 శాతమే కొనుగోళ్లు చేశాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు 59,708 టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా 43,755 టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

News November 29, 2024

SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.

News November 29, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’

image

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.

News November 29, 2024

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

News November 29, 2024

3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలివే..

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ రన్ టైమ్ 3 గంటలకుపైనే అని తెలుస్తోంది. తెలుగులో అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రంగా దానవీరశూరకర్ణ(3.46 గం.) ఉంది. ఆ తర్వాత లవకుశ(3.28 గం.), పాండవ వనవాసం(3.18గం.), పాతాళ భైరవి(3.15గం.) వంటి చిత్రాలు నిడివి ఎక్కువగా ఉండి అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RRR వంటి సినిమాల రన్ టైమ్ 3 గంటలకు‌పైనే కావడం గమనార్హం.