India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హరియాణాలో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు BJPలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ కమలం గూటికి చేరుకున్నారు. వీరి చేరికతో బీజేపీ ఎమ్మెల్యేల బలం 50కి చేరుకుంది. మరోవైపు భారత సంపన్న మహిళ, హిసార్ ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ పాక్పై సెంచరీతో చెలరేగారు. ముల్తాన్లో జరుగుతోన్న టెస్టు మ్యాచులో ఆయన తన 35వ టెస్టు సెంచరీని పూర్తిచేసుకున్నారు. దీంతో అన్ని ఫార్మాట్లలో రూట్ 51 సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన రెండో యాక్టివ్ ప్లేయర్గా నిలిచారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (48), కేన్ (45), స్మిత్ (44) ఉన్నారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా $1.4 బిలియన్లతో టైలర్ పెర్రీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకంటే కూడా సినీరంగంలో మోస్ట్ రిచెస్ట్ నటి ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికన్ నటి జామీ గెర్ట్జ్ ప్రపంచంలోనే ధనవంతురాలని పేర్కొంది. గెర్ట్జ్ నికర విలువ $8 బిలియన్లు ( ₹ 66,000+ కోట్లు). ఆ తర్వాతి స్థానాల్లో టేలర్ స్విఫ్ట్ ($1.6 బిలియన్), రిహన్నా ($1.4 బిలియన్), సెలెనా గోమెజ్ ($1.3 బిలియన్) ఉన్నారు.

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.
Sorry, no posts matched your criteria.