India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పుంజుకున్నారు. మొన్నటి వరకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని సర్వేలు అంచనా వేశాయి. ఆమె వైపు 48% మంది అమెరికన్లు మొగ్గు చూపగా ట్రంప్నకు 44% మంది మద్దతు పలికారు. అయితే తాజా సర్వేల్లో ఈ అంతరం 2శాతంగా ఉంది. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కమలకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.

AP: అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఆ 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP: మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో మరిన్ని టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని CRDA భావిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఫ్లాట్లు ఇచ్చేందుకు వీలుగా NTR ఎంఐజీ టౌన్షిప్లను నిర్మించనుంది. దీని కోసం ర్యాపిడ్ గ్రోత్ ఉండే వీజీటీఎం ఉడా పరిధిలోని భూములు, ప్రైవేట్ భూముల కోసం అన్వేషిస్తోంది. భూములిచ్చే రైతులకూ కొన్ని ఫ్లాట్లను ఇవ్వనుంది. ఇప్పటికే 4 టౌన్షిప్లకు వేలం వేయగా రూ.46.91 కోట్ల ఆదాయం వచ్చింది.

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నష్టాలపై విచారణను అర్ధంతరంగా ముగించిన న్యాయ కమిషన్ ఈనెల 21న మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై అఫిడవిట్లు సమర్పించిన వారిని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించే అవకాశం ఉంది. IASలు, విశ్రాంత IASలతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటితో దసరా సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాలేజీలు మాత్రం నేటి నుంచే తెరుచుకోనున్నాయి. అటు ఏపీలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 2 నుంచి 13 వరకు దసరా సెలవుల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకానున్నారు. కాగా ఇంటర్ కాలేజీలను ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నారు.

దక్షిణ కొరియా తమ దేశంలోకి డ్రోన్లను పంపిస్తోందని ఆరోపిస్తూ తమ సైన్యాన్ని నార్త్ కొరియా సమాయత్తం చేసింది. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా వెంటనే కాల్చేయాలని స్పష్టం చేసింది. తమ అధినేత కిమ్ను విమర్శించే పార్సిళ్లను దక్షిణ కొరియా పంపుతోందని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణల్ని సియోల్ కొట్టిపారేస్తోంది. వాటిని తాము పంపడం లేదని తేల్చిచెబుతోంది.

జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

APలో అల్పపీడన ప్రభావం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు NDRF బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం <<14350584>>ఏర్పడనుందని<<>> అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

హీరో నారా రోహిత్తో హీరోయిన్ సిరి లెల్ల నిశ్చితార్థం జరిగింది. కాగా సిరి పూర్తి పేరు శిరీషా. ఈమెది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల. శిరీషాకు నలుగురు తోబుట్టువులు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మీ రెంటచింతలలో అంగన్వాడీ సూపర్వైజర్. రెండో అమ్మాయి భవానీ పెళ్లి చేసుకుని USలో, మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని HYDలో స్థిరపడ్డారు. ప్రియాంక వద్ద ఉంటూ శిరీషా సినిమా ప్రయత్నాలు చేశారు.

ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్కు సాయం చేయడంలో అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్కు అత్యాధునికమైన థాడ్(టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)బ్యాటరీతో పాటు సైనిక దళాలను కూడా యూఎస్ పంపింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను థాడ్ కూల్చేస్తుంది. మరోవైపు తమ ప్రజలు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.
Sorry, no posts matched your criteria.