news

News April 20, 2024

చిరంజీవిని జగన్ అవమానించారు: పవన్

image

AP: రాజానగరం వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియాలనే పొగపెట్టా. అందరూ వైసీపీలోకి వెళ్లారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే. నాపై చాలాసార్లు రాళ్లు విసిరారు, తట్టుకున్నా. జగన్‌లా డ్రామాలు ఆడలేదు. సినిమా టికెట్ ధరలు పెంచాలని వెళ్తే.. చిరంజీవిని జగన్ అవమానించారు’ అని ఫైరయ్యారు.

News April 20, 2024

మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

image

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా గురించి రాజమౌళికి తప్ప మరెవరికీ వివరాలు తెలియవు. స్టోరీ, షూటింగ్, క్యాస్టింగ్, రిలీజ్ వంటి విషయాలు ఆయనొక్కరికే తెలుసు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.

News April 20, 2024

రేవంత్ పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు: హరీశ్

image

TG: హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదన్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారని విమర్శించారు.

News April 20, 2024

ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: పవన్ కళ్యాణ్

image

APలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీని కోరారు. ‘కూటమి అభ్యర్థులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం మారబోతోందని పోలీసులు గుర్తించాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా లేని పోలీసులపై చర్యలు తీసుకుంటాం. దేశంలో, రాష్ట్రంలో NDA ప్రభుత్వం రాగానే యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తాం’ అని రాజానగరం సభలో స్పష్టం చేశారు.

News April 20, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి

image

సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వార్ సర్వేశ్ కుమార్ మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లు యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరి తెలిపారు.

News April 20, 2024

ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి

image

ఇటీవల పంజాబ్‌లోని పటియాలలో బర్త్‌డే కేక్ తిని బాలిక మరణించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. లుధియానాకు చెందిన ఏడాదిన్నర చిన్నారికి పటియాలాలోని బంధువులు చాక్లెట్లతో కూడిన గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వచ్చాక బాలిక వాటిని తిన్నది. కాసేపటికే ఆమె బ్లడ్ వామిటింగ్ చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గడువు తీరిన చాక్లెట్లు తినడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.

News April 20, 2024

‘కల్కి’ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే పోస్టర్‌లో రేపు రాత్రి 7.15 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 20, 2024

హెడ్ వీరవిహారం.. 32 బంతుల్లో 89 రన్స్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ విజృంభించి ఆడారు. 32 బంతుల్లో 89 రన్స్‌తో వీరవిహారం చేసి ఔటయ్యారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సులు, 11 ఫోర్లున్నాయి. హెడ్‌ విధ్వంసం ముందు ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. కాగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో హెడ్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. మరోవైపు ధాటిగా ఆడిన హెడ్, అభిషేక్‌ను కుల్దీప్ వెనక్కి పంపారు. 10 ఓవర్లకు SRH స్కోర్ 158/4.

News April 20, 2024

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరం లేదు: జైలు అధికారులు

image

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమని డాక్టర్లు సూచించలేదని తిహార్ జైలు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య స్థితిపై LGకి రిపోర్ట్ అందించారు. అరెస్ట్ సమయంలో ఆయన కేవలం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్ సూచనతో కొన్ని నెలల క్రితం తాను ఇన్సులిన్ తీసుకోవడం మానేసినట్లు జైల్లో వైద్యులతో ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా లేవన్నారు.

News April 20, 2024

ప్చ్.. జస్ట్ మిస్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 46 రన్స్ చేసి ఔటయ్యారు. 6 సిక్సులు, 2 ఫోర్లతో చెలరేగారు. అతను అవుట్ అయిన బంతికి ఫోర్ వెళ్లి ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయ్యుండేది. కానీ త్రుటిలో అతను ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డు RR ప్లేయర్ జైస్వాల్ (13 బంతులు) పేరిట ఉంది.