Adilabad

News September 27, 2024

ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ ఫలితాలు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. 2024 జులైలో నిర్వహించిన రెండో సంవత్సరం 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఉమ్మడి జిల్లా విద్యార్థులు https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News September 26, 2024

నిర్మల్: అరెస్టు అయిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

నిర్మల్ జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు దాసరి రమేశ్, వెంకటేశ్ గౌడ్‌‌ను బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించి డీఈవో రవీందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

తాంసీ: ఆ ఒక్క టీచర్ రాకపోతే బడికే తాళం..?

image

తాంసీ మండలంలోని గోట్కూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 53 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ ఉన్నారు. ప్రస్తుతం ఉపాద్యాయురాలు రోజా రాణి ఒకరే అన్ని తానై విధులు నిర్వహిస్తున్నారు. సరి పడా టీచర్లు లేక పోవడంతో 3 నెలలు గా తమ పిల్లల  చదువును నష్ట పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News September 26, 2024

పెంచికల్‌పేట: నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం

image

పెంచికల్‌పేట మండలంలోని కొండపల్లిలో నాలుగు కాళ్ల కోడి పిల్ల జన్మించింది. గ్రామానికి చెందిన చౌదరి గంగయ్య కొంతకాలంగా కోడిని పెంచుకుంటున్నారు. అది 9 పిల్లలకు జన్మనివ్వగా, ఇందులో ఒక దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి. జన్యు లోపాలతో నాలుగు కాళ్లు ఉన్న కోడి పిల్లలు అరుదుగా జన్మిస్తుంటాయని పశు వైద్య నిపుణులు తెలిపారు.

News September 26, 2024

ఆదిలాబాద్: వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

image

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 – OCT 1 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సబితా అన్నారు. ఈ నెల 26న వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, 27న వాకతాన్ ర్యాలీ, 28న ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు, 29న తల్లిదండ్రుల పోషణ, 30న గ్రాండ్ పేరెంట్స్ డే, OCT 1న వారోత్సవాలు ముగుస్తాయన్నారు.

News September 25, 2024

నిర్మల్ జిల్లా ఎస్పీని కలిసిన ట్రైనీ ఎస్సైలు

image

బుధవారం నిర్మల్ జిల్లాకు కేటాయించిన 7 మంది ట్రైనీ ఎస్సైలు జిల్లా ఎస్పీ జానకీ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. క్రమశిక్షణతో ఉంటూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శిక్షణలో అన్ని రకాల డ్యూటీలు నిర్వహించాలన్నారు.

News September 25, 2024

ADB: విషాదం.. పురుగు మందు తాగిన ప్రేమికులు

image

ఉట్నూరు మండలం రాంజీగూడకు చెందిన ఆత్రం హనుమంత్, నార్నూర్ మండలానికి చెందిన ఓ యువతీ ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందారు. సోమవారం పురుగు మందు తాగేశారు. హనుమంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. హనుమంత్ మృతి చెందగా, యువతిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 25, 2024

ADB: పోలీసుల విధులకు ఆటంకం.. 13మందికి పైగా కేసులు

image

పోలీసుల విధులకు అడ్డుపడి, పోలీస్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డు పై వచ్చి పోయే వారికి ఇబ్బంది పెట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ కరుణాకర్ రావ్ తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థి చనిపోగా కారకులపై చర్యలు తీసుకోవాలని బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్నా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో 13 మందితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయితీ ఎన్నికలు, నర్సరీ ప్లాంటేషన్, హరితనిది, హార్టికల్చర్ ప్లాంటేషన్, వైద్యం, స్వచ్ఛదనం పచ్చదనం, పీసా యాక్ట్ తదితర అంశాలపై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. సీజినల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు.

News September 24, 2024

వాంకిడి: ఎడ్లబండి పై వాగు దాటిన ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ITDA PO ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం వెల్గి ఆశ్రమ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎడ్లబండి పై వాగు దాడి వెళ్లారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.