Adilabad

News August 7, 2024

ఆదిలాబాద్:KU డిగ్రీ 6వ సెమిస్టర్లో ఫెయిలైన విద్యార్థులకు గమనిక

image

ADB:KU డిగ్రీ (థియరీ) 6వ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.తిరుమల దేవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ను నిన్న విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News August 7, 2024

ADB: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

image

TOSS ఓపెన్ స్కూల్ విధానంలో 2024-25 సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖధికారిణి ప్రణీత తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా AUG 8 నుంచి SEP 10 వరకు, అపరాధ రుసుంతో SEP 11 నుంచి OCT 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>> SHARE IT

News August 7, 2024

తలమడుగు: ఎడ్ల బండిపైనే ఆగిన రైతు గుండె

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామానికి చెందిన రైతు గోక సంజీవ రెడ్డి (48) వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండిపై పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఎడ్ల బండిపై ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 7, 2024

ఆసిఫాబాద్: గర్భిణులను వెంటాడుతున్న రక్తహీనత

image

ఆసిఫాబాద్ జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండేళ్లలో 10 మంది గర్భిణులు మృతిచెందారు. కాగా జిల్లాలో 3,939 మంది గర్భిణులు ఉండగా వారిలో 1,894 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా అందాల్సిన పోషకపదార్థాల్లో నాణ్యత లేకపోవడం, సక్రమంగా పంపిణీ కావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి ప్రసవ సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

News August 7, 2024

మాదక ద్రవ్యాలను ఏ రూపంలో ఉన్నా నియంత్రించాలి: కలెక్టర్

image

అసిఫాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాలను ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర సంబంధిత శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News August 6, 2024

సింగరేణి సంస్థలో పలువురు అధికారుల బదిలీ

image

సింగరేణి సంస్థలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేట్ జీఎం ఎం.సుభాని, భూపాలపల్లి జీఎం డి.రవిప్రసాద్, మందమర్రి జిఎం ఎ.మనోహర్, ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్, మార్కెటింగ్ జిఎం జి. దేవేందర్, కార్పొరేట్ జిఎం సుశాంత సాహ, మణుగూరు జిఎం డి. లలిత్ కుమార్, అర్జీ వన్ ఏజెంట్ బానోతు సైదులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే గ్రూప్ ఏజెంట్ ఎం.శ్రీనివాస్ బదిలీ అయ్యారు.

News August 6, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి CRIME REPORT

image

◆ నేరడిగొండ: తప్పిన పెను ప్రమాదం
◆ రెబ్బెన: ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం
◆ మంచిర్యాల: చికిత్స పొందుతూ హాస్టల్ వార్డెన్ మృతి
◆ బైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
◆ సిరికొండ : అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
◆ బైంసా: పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
◆ నిర్మల్: అదృశ్యమైన వ్యక్తి.. శవమై తెలి
◆ తిర్యాని: లభించని గల్లంతైన యువకుడి సమాచారం
◆ దండేపల్లి: అక్రమంగా తరలిస్తున్న టేకు పట్టివేత

News August 6, 2024

బైంసా: మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం బైంసా మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ మారుతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేగాం గ్రామానికి చెందిన గడ్డమత్తుల సుభాష్ (35) మద్యానికి బానిసై మద్యం మత్తులో గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

News August 6, 2024

ADB: ప్రశంస పత్రాలు అందుకున్న పోలీసు అధికారులు

image

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ACP, CIలకు DGP జితేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మంచిర్యాల రూరల్ CI అశోక్ కుమార్, మందమర్రి CI శశిధర్ రెడ్డి, శ్రీరాంపూర్ CI మోహన్‌లు వీరు పనిచేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసులో కేసు నమోదు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేశారు.

News August 6, 2024

ఆదిలాబాద్: విద్యార్థులకు రేపు మరొక అవకాశం

image

DEECETలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు AUG 1 నుంచి 6 వరకు షెడ్యూల్ ప్రకారం ఆదిలాబాద్ డైట్ కళాశాలలో వెరీఫికేషన్ ప్రక్రియ జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా.రవీందర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల్లో 511 మంది వెరీఫికేషన్‌కు హాజరు కాలేదన్నారు. ఆ సీట్ల కోసం AUG 7న వెరీఫికేషన్ చేసుకోవడానికి వారికి మరో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.