India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గడిచిన 24 గంటల్లో జిల్లాలోని భీంపూర్ మండలంలో అత్యధికంగా 26.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జైనథ్లో 20.5 మి.మీ, సాత్నాలో 19.3 మి.మీ. వర్షపాతం రికార్డయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు రెండు రోజుల పాటు పంటలకు మందులు పిచికారీ చేయకుండా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.

తాంసి మండలంలోని గొట్కూరిలో మద్యం మత్తు విషాదంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మడావి లక్ష్మణ్(48) సోమవారం రాత్రి స్నేహితులతో అధిక మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబీకులు రిమ్స్కు తరలించారు. అప్పటికే మృతిచెందడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు.

గణపతి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టర్లు వారీగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో నిరంతరం గస్తీతో పర్యవేక్షిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్రెడ్డిని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి హైదరాబాద్లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాలల పరిరక్షణ, దత్తత, విద్య, ఎన్జీవోల పాత్ర వంటి వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.

పర్యావరణాన్ని రక్షించేందుకు, నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే హానిని నివారించేందుకు మట్టి గణపతులు దోహదపడుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని టీటీడీసీలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. 2,000 ఎస్హెచ్జి గ్రూపులకు, 1,000 మెప్మా ఆర్పీలకూ మట్టి విగ్రహాలను అందజేశారు.

ఆదిలాబాద్ ఎఫ్డీఓగా శిక్షణ ఐఎఫ్ఎస్ చిన్న విశ్వనాథ బుసరెడ్డి నియామకమయ్యారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి పరిచయం చేసుకున్నారు. జిల్లాలో అడవుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి అడవి జంతువులను కాపాడటం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పోలీస్, ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు.

ADB ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో BA రెండో సంవత్సరం చదువుతున్న కుమ్ర శశికాంత్ నేవీలో ఉద్యోగం సాధించాడు. సోమవారం కళాశాలలో శశికాంత్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం ఘనంగా సన్మానించారు. దేశ సరిహద్దుల్లో సేవ చేయడానికి తమ కళాశాల విద్యార్థి వెళ్లడం గర్వకారణమని అభినందనలు తెలిపారు.

భారీ వర్షాలకు ఆదిలాబాద్ అర్బన్లో జలమయమైన లోలెవల్ బ్రిడ్జిలు.. హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా సోమవారం సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించారు. దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి శాశ్వత పరిష్కార మార్గంపై చర్చించారు.

గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దడం పోలీసులు ప్రధాన లక్ష్యం అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నార్నూర్ మండలం సుంగాపూర్లో గంజాయి పండిస్తున్నారని సమాచారం మేరకు సీసీఎస్, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ భూమిలో 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి పండించిన కొడప దేవురావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.