India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ మండలం అంకోలిలో ఆయన ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టవద్దని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన సీపీఎస్ రద్దు పరిచి ఓపీఎస్ అమలు చేయించడమే పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నూర్ సింగ్, నవీన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగిన విరమణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు.

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆదిలాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి పర్యటించారు. ఆమె పర్యటనలను గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణపతి మండపాల వద్ద సౌండ్ బాక్సులు, మైక్ సెట్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి డీజేలను అద్దెకు తెచ్చి ఇచ్చేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఏర్పడడం వలన జిల్లా ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకి వారికి కూడా ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న బుధవారం తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.

ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్లో గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన బిలాల్, చిలుకూరి లక్ష్మీనగర్కు చెందిన షారుక్తోపాటు మరో ముగ్గురు చోరీకి యత్నించారన్నారు. బుధవారం పంజాబ్ చౌక్లో అనుమానస్పదంగా తిరుగుతున్న బిలాల్, షారుక్లను అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.