India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేతావత్ సర్దార్ సింగ్, సంధ్య దంపతుల కుమార్తె కేతావత్ నిఖిత ఏడాది కాలంగా పోటీపడ్డ ప్రతి ఉద్యోగాన్ని సాధించింది. మైనార్టీ గురుకులంలో టీజీటీ, అదే గురుకులంలో జూనియర్ లెక్చరర్, సాంఘిక సంక్షేమ గురుకులంలో పీజీటీ, గురుకుల సొసైటీలో డిగ్రీ లెక్చరర్ పోస్టు, టీఎస్పీఎస్సీ గ్రూప్-4, టీఎస్పీఎస్సీలో జూనియర్ లెక్చరర్ పోస్టులను వరుసగా సాధించింది.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అదృశ్యమైన ఓ వ్యక్తి ఇవాళ చెరువులో శవమై కనిపించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉమార్ అనే వ్యక్తి నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే ఇవాళ అతని శవం స్థానికులకు చెరువులో కనిపించింది. దీంతో వారు మృతుడి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు.
శ్రావణమాసం ప్రారంభం కావడంతో పల్లె, పట్టణాల్లో పూజలు మొదలయ్యాయి. పెళ్లి సందళ్లు సన్నాయి సవ్వడులు వినిపించనున్నాయి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న తరుణంలో ఇళ్లవద్ద ఇబ్బందులుంటాయని కళ్యాణ మండపాలపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెళ్లి బాజా మోగనున్న నేపథ్యంలో అనేక మందికి చేతినిండా పనులు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల జంటలు ఏకం కానున్నట్లు అర్చకుల టాక్.
కడుపునొప్పి భరించలేక వాంకిడి మండలానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సాగర్ తెలిపారు. బెండార గ్రామానికి చెందిన సోనీ(20) హైదరాబాద్లో GNM సెకండియర్ చదువుతోంది. గతేడాదిగా ఆమె కడుపునొప్పితో భాదపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ అమలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ఐఏఎస్లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ జి.రవి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె.ఇలంబరిదిలను నియమించారు.
బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. ఉదయం 11:15నుంచి 1:30 గంటల వరకు పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.
★ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
★కాగజ్నగర్: మట్కా ఆడుతూ పట్టుబడిన యువకుడు
★ముధోల్: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
★రామకృష్ణాపూర్: ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
★నస్పూర్: పేకాట ఆడుతున్న ముగ్గురు పట్టివేత
★నేరడిగొండ: లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
★నిర్మల్: వైన్ షాపులో చోరీ
★మంచిర్యాల:షార్ట్ సర్క్యూట్తో కారులో మంటలు
★మంచిర్యాల: పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
తలమడుగు పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతజీ దివేనలతో అర్లిలో 24 సంవత్సరాల తర్వాత ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని గ్రామస్థులు నెల రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లకి యాత్రలో పాల్గొన్నారు.
కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 696.22 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 4,323 క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి తేదీ అని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న నూతన రైతులు తమ రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. రైతు బీమా ఫామ్, రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్, బ్యాంక్ జిరాక్స్ కాపీలను వారి వెంట తెచ్చుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.