Adilabad

News August 20, 2025

ADB: గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

image

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్ఐ విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.

News August 20, 2025

ADB: ‘బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం’

image

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఇచ్చోడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందన్నారు. నాయకులు జంగుబాపు, సతీష్ తదితరులున్నారు.

News August 20, 2025

ADB: ‘CCI పరిశ్రమను పునరుద్ధరించాలని వినతి’

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ ఢిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీసీఐని పునరుద్ధరించాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP నగేష్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలను కేంద్ర మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు.

News August 20, 2025

వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో వరద బీభత్సానికి డ్యామేజ్ అయినా వివరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్, శానిటేషన్ తదితర వాటిపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను, రోడ్లు, తదితర వాటి అంచనాలను వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు.

News August 20, 2025

భీంపూర్: ఉప్పొంగిన వాగు.. ఆగిపోయిన బస్సు

image

ADB నుంచి గోమూత్రి, కరంజి గ్రామాలకు వెళ్లే బస్సును అంతర్గామ్ వద్ద వాగు ఉప్పొంగడంతో రాత్రి మార్గమధ్యంలోనే నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై పీర్ సింగ్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకొని స్థానిక యువకులతో కలిసి తాడు సహాయంతో ప్రయాణికులను వాగు దాటించారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వాగులు, వంకలను దాటవద్దని ఎస్సై సూచించారు. తమకు సహకరించిన పోలీసులు, యువకులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.

News August 19, 2025

ADB: మంత్రి జూపల్లికి BRS నాయకుల వినతి

image

ADB పర్యటనకు వచ్చిన ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని బీఆర్ఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి లేఖలో డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రూ.25 వేల పరిహారం చెల్లించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో అజయ్, సాజిత్, గోవర్ధన్, దేవిదాస్, వేణుగోపాల్, సలీమ్ ఉన్నారు.

News August 19, 2025

ADB: దత్తు కుటుంబానికి ఆర్థికసాయం

image

మే నెలలో తరోడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.5 లక్షల చెక్కును మంగళవారం ఆదిలాబాద్‌లో అందజేశారు. ఈ విషాధ సంఘటన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సహాయనిధి కింద కుటుంబానికి ఆర్థికభరోసా కల్పించినట్లు తెలిపారు. MLAలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ తదితరులున్నారు.

News August 19, 2025

ADB: 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తెలిపారు. చాంద(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల క్రీడాకారులు 9492136510 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News August 19, 2025

ADB: అంబులెన్స్‌లో ప్రసవం.. కవలలకు జననం

image

అంబులెన్స్‌లో ఓ మహిళ ప్రసవించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. ముక్రా(బి)కి చెందిన ప్రతిక్ష అనే మహిళకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ అంబులెన్స్‌కు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతిక్ష ప్రసవించి, కవల పిల్లలకు జన్మనిచ్చిందని అంబులెన్స్ పైలట్ వినోద్, ఈఎంటీ రాకేశ్ తెలిపారు.

News August 19, 2025

భారీ వర్షాలు.. నేడు విద్యా సంస్థలకు సెలవు: ADB కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని విద్యా సంస్థలకు (ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు) సెలవు ప్రకటించినట్లు తెలిపారు.