India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమకు దొరికిన సెల్ ఫోన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి చిన్నారులు తమ నిజాయితీని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ముగ్గురు చిన్నారులకు బుధవారం ఓ సెల్ఫోన్ దొరికింది. వెంటనే 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. రాంనగర్ కాలనీకి చెందిన దేవిదాస్ ఫోన్ గా పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి ఎస్ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు, దేవిదాస్ చిన్నారులను అభినందించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మహాలక్ష్మి పథకం వినియోగానికి సంబంధించి ఆదిలాబాద్ RTC రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే నిర్మల్ డిపోలో అధికంగా లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుండి జులై వరకు నిర్మల్ జిల్లాలో జీరో టిక్కెట్ తీసుకున్న మహిళలు 96.54 లక్షల మంది ఉన్నారు. మంచిర్యాలలో 78 లక్షలు, ఆదిలాబాద్లో 50 లక్షలు, బైంసాలో 56 లక్షలు, ఆసిఫాబాద్లో 49, ఉట్నూర్ పరిధిలో 16 లక్షల మంది అతివలు, బాలికలు ప్రయాణం చేశారు.
తన ఇంట్లో నాగుపాము ఉందని తెలిసి ఓ వృద్ధురాలు కొన్నేళ్లుగా పాముకు పూజలు చేయగా.. చివరకు ఆ పాముకాటుకు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెకి చెందిన గంగవ్వ(65) అంగన్వాడీ ఉద్యోగిగా రిటైరై ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం ఇంట్లో అలుకుతుండగా తాను పూజించిన పాము చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.
★ ఆదిలాబాద్ జిల్లాలోని KGBVలో 13 నాన్ టీచింగ్ పోస్టులు.. AUG 1లోపు దరఖాస్తులు
★ అంబెడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు.. AUG 18 LAST
★ AUG 1 నుండి DEECET సర్టిఫికెట్ వెరీఫికేషన్
★ పీజీ అసైన్మెంట్ సబ్మిషన్ కు నేడే LAST
★ నేడు పాలిసెట్ సీట్ల కేటాయింపు
★ RIMSలో వైద్య పోస్టుల భర్తీ.. AUG 6న ఇంటర్వ్యూ
★ ఆర్థికసహాయంకై.. ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు
★ DOST రిజిస్ట్రేషన్ AUG 2న లాస్ట్
రైతులకు మేలుచేసే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమానికి జిల్లాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా నోడల్ అధికారి రమేశ్ 7288894003 సంప్రదించాలని సూచించారు.
>>SHARE IT
LRS దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియలో కదలిక రానుంది. నిర్మల్ జిల్లాలోని మూడు పట్టణాల్లో 26,182 దరఖాస్తులకు మోక్షం కలగడంతోపాటు దాదాపు రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో DEECETలో ర్యాంక్ సాధించిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. D.EDలో ప్రవేశానికి AUG 1 నుండి AUG 6వరకు సర్టిఫికెట్ వెరీఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ అభ్యర్థులకు కేటాయించిన తేదీలలో ఆదిలాబాద్ డైట్ కళాశాలలో హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు
◆ నిర్మల్: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం
◆ ఆదిలాబాద్: రెండు ఆలయాల్లో దొంగతనం
◆ వాంకిడి: పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు
◆ బాసర: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
◆ గుడిహత్నూర్: విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి
◆ మంచిర్యాల: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్
◆ పెంబి: పురుగుల మందు తాగి యువకుడు మృతి
◆ ముధోల్: కుక్కల దాడిలో దూడ మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలు, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO ప్రణీత/ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. మొత్తం 13 పోస్టులకు జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు పోస్టులకు సంబంధిత MEO కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు.
Sorry, no posts matched your criteria.