India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోథ్ మండలం చింతగూడకి చెందిన గేడం వినోద్ కుమార్ (25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 12న తల్లిదండ్రులు మందలించడంతో పురుగుల మందు తాగాడు. ADB రిమ్స్ లో చికిత్స పొంది మార్చి 4 న ఇంటికి తీసుకెళ్లారు. అనారోగ్యం తిరగబెట్టడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించాడని తెలిపారు
ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు చేపట్టడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులకు ప్రకటనలు తెలిపారు. కావున ఆన్లైన్లో పత్తి పంట వివరాలు డేటా కలిగి ఉన్న రైతులు తమవద్ద మిగిలి ఉన్న నాణ్యమైన పత్తిని 10వ తేదీ లోపే తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. ఈ విషయంపై సీసీఐ, మార్కెట్ శాఖ అధికారులకు రైతులు సహకరించాలని కోరారు.
వేసవికాలం ప్రారంభం మొదలు తాగునీటి కోసం గిరిజనులకు తిప్పలు తప్పడంలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బజార్హత్నూర్ మండలం చింతకర్రలో మిషన్ భగీరథ నీళ్లు అందక ఆ గ్రామస్తులు వ్యవసాయ బావి నుంచి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కనీసం నీటి సమస్యను పరిష్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని, బజార్హత్నూర్లో నీటి సమస్యపై మాజీ మంత్రి ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు
ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ ఐపీఎస్ నియామకమయ్యారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్న గౌస్ ఆలం ఐపీఎస్ కరీంనగర్ పోలీస్ కమిషనర్గా బదిలీపై వెళ్ళనున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల ఎస్పీగా వ్యవహరిస్తున్న అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
చేతివృత్తుల కోర్సుకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హేయిర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేశామన్నారు. http//bse.telangana.gov.in వెబ్ సైట్లో రోల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకొని ఫలితాలు చూడవచ్చని సూచించారు.
నేరడిగొండలో <<15670214>>దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదన్నారు.
కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కురిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ADBలో గాలినాణ్యత విలువ 90గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
అనారోగ్యానికి గురై ఓ పంచాయతీ కార్యదర్శి గురువారం మృతి చెందాడు. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవళ్ల రాజు (36) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆయన ఖానాపూర్ మండలంలోని దాసునాయక్ తండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంతి సంతాపం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ పై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైతే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.