Adilabad

News March 7, 2026

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి: ADB ఎస్పీ

image

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, బాధితులు వెంటనే స్పందిస్తేనే నగదు రికవరీకి అవకాశం ఉంటుందన్నారు.

News March 7, 2026

సైబర్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్: ADB CI

image

ఆదిలాబాద్ స్థానిక కెనరా బ్యాంక్ కరెంట్ ఖాతా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌సీఆర్‌పీ డేటా విశ్లేషణలో ఈ ఖాతాకు దేశవ్యాప్తంగా 146 ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు CI నాగరాజు వెల్లడించారు. నిందితులు రాజవర్ధన్, శ్రీ అక్షయ్, రాజేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News March 6, 2026

9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.

News March 6, 2026

ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.

News March 6, 2026

అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం

image

ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెలలో 54 ఫిర్యాదులు స్వీకరించి, 61 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 118 హాట్‌స్పాట్‌లలో తనిఖీలు చేపట్టి 53 మంది పోకిరీలపై చర్యలు తీసుకున్నారు. “పోలీసు అక్క” ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712659953 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

News March 5, 2026

ప్రజాపాలనతోనే అభివృద్ధి: ADB కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జెడ్పీ హాల్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 5, 2026

ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 4, 2026

ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

image

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.

News March 4, 2026

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికపై సమీక్ష

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

News March 4, 2026

ADB: ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

image

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.