India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగలో గల్లంతైన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ మిత్రులతో కలిసి ఆదివారం రాత్రి పెన్గంగాకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఐతే సోమవారం యువకుడి కోసం డీడీఆర్ఎఫ్ బృందం పోలీసులు గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు.
క్యాన్సన్ బారినపడ్డ వారు జిల్లాలో 365 మంది ఉన్నట్లు పాలియేటివ్ కేర్ ద్వారా గుర్తించారు. ఆరోగ్య మహిళా క్లినిక్లు స్టార్ట్ అయిన నాటి నుంచి టెస్టులు చేయించుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. థైరాయిడ్తో 188, మూత్రాశయ సమస్యలు 1,081, PCOS 994, మెనోపాజ్ 4,058, సుఖవ్యాధులతో 50, ఓరల్ క్యాన్సర్ అనుమానితులు 23, రొమ్ము క్యాన్సర్ 64, గర్భాశయ క్యాన్సర్ 22, క్యాన్సర్ నిర్ధారణ అయిన వారు 02 మహిళలున్నారు.
మిషన్ భగీరథ పథకం తీరుపై జూన్ మొదటి వారం నుంచి సర్వే చేపడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ద్వారా నిధులు సమీకరించేందుకు ఇంటింటి సర్వే కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 468 పంచాయతీల్లో 1,45,502 గృహాల్లో 1,44,267 ఇళ్లల్లో సర్వే చేశారు. మొత్తం 99 శాతం పూర్తి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందుతుందా? ఎన్ని ఇళ్లకు సరఫరా అవుతోంది అలాగే తదితర విషయాలపై త్వరలోనే లెక్క తేలనుంది.
★ బాసర: పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యయత్నం
★ ఆదిలాబాద్: చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలు అరెస్ట్
★ కుబీర్: అప్పులబాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
★ జైనథ్: పెన్ గంగా నదిలో యువకుడు గల్లంతు
★ లోకేశ్వరం: పట్టపగలే తాళం ఉన్న ఇంట్లో చోరీ
★ సిర్పూర్: వైన్స్ షాపులో చోరి
★ చెన్నూర్: నిషేధిత గుట్కా పట్టివేత
★ ఇచ్చోడ: వాహనం ఢీకొని జింక మృతి
★ దీలవార్పూర్లో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లెక్కలపై స్పష్టత లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో డీసీసీబీ పరిధిలో రూ. లక్ష లోపు పంట రుణం పొందిన రైతులు 35,560 మంది ఉండగా మాఫీ సొమ్ము రూ.183.21 కోట్లుగా ఉంది. 12,477 మందికి రూ.63.25 కోట్లు మాత్రమే మాఫీ సొమ్ముజమైంది. సంఘాల వారీగా అనేక మంది పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జైనథ్ మండలం డొల్లార వద్ద పెనుగంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెనుగంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బల్దియా యంత్రాంగం పారిశుద్ధ్య వాహనాలపై నిఘాపెట్టింది. పట్టణంలో చెత్త సేకరణకు వెళ్లిన ట్రాలీలు, ట్రాక్టర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకునేందుకు.. GPS ట్రాకింగ్ విధానం అమలు చేస్తోంది. చోదకులు వాహనాలను దారి మళ్లించడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ నిలిపి విశ్రాంతి తీసుకోవడం వంటి పనులకు అడ్డుకట్ట పడనుంది. కార్మికుల పనితీరును అధికారులు తెలుసుకోనున్నారు.
రాగల మూడు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు, నది తీరాన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
>>>TAKE CARE
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు జులై 26 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. జులై 26, 30, ఆగస్టు 1,3,5 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2, 3 సెమిస్టర్లకు చెందిన రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.