Adilabad

News July 19, 2024

బాసర: నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం

image

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఆలయం పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ విజయరామారావు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు గురుపౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

News July 19, 2024

ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వివిధ గ్రామాల్లో 100కు పైగా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోగులు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు సూచిస్తున్నారు.

News July 19, 2024

వాంకిడి: భగ్గుమంటున్న టమాటా ధరలు

image

వాంకిడి మండలం కేంద్రంలో గురువారం సాగిన సంతలో టమాట కేజీ రూ.100, పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ.120కు లభించాయి. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు అందుబాటులో ఉన్న టమోటా ధర పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

News July 19, 2024

ఆదిలాబాద్ రైతుతో మాట్లాడిన CM రేవంత్ రెడ్డి

image

తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ అనే రైతుతో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని CM అడుగగా రైతు ఒక ఎకరం సగం ఉన్నదని బదులిచ్చారు. 50,000 లోన్ తీసుకున్నాను ఏకకాలంలో రుణమాఫీ అవడం చాలా సంతోషంగా ఉన్నదని రైతు తెలిపారు. మీ ఊరిలో అందరికీ చెప్పాలి మీ ఆదిలాబాద్ జిల్లాకి 120 కోట్లు ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

News July 18, 2024

బజారత్నూర్: డిప్యూటీ CM పర్యటన రద్దు.. జిల్లాకు CM

image

బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరొకసారి పర్యటన రద్దయింది. ఆయన పర్యటిస్తారన్న నేపథ్యంలో బుధవారం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పిప్రి గ్రామంలో ఇదివరకు కూడా పర్యటిస్తామని తెలిపి ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

News July 18, 2024

ఆదిలాబాద్: ప్రజాపాలన సేవాకేంద్రం ప్రారంభం

image

ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారులు ప్రజాపాలన సేవా కేంద్ర ద్వారా డేటా సవరణ చేసుకోవచ్చని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో సీపీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభించారు. సవరణ కొరకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్పిజి కస్టమర్ ఐడి తీసుకెళ్ళలని సూచించారు.

News July 18, 2024

ADB: మద్యం మత్తులో మహిళ హంగామా

image

మద్యం మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గురువారం నిర్మల్‌కు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ఇబ్బందులకు గురిచేసింది. మహిళను బస్సు దిగమని కండక్టర్ సూచించినప్పటికీ దిగనని మొండికేసింది. దీంతో బస్సును కలెక్టర్ చౌక్ వద్ద నిలిపివేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా బస్సులోంచి కిందికి దింపేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.

News July 18, 2024

ADB: కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది సస్పెండ్

image

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది నాయకులను సస్పెండ్ చేశారు. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ విధిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో నలుగురు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.

News July 18, 2024

ఆదిలాబాద్: ఐటీఐలో అడ్మిషన్లకు గడువు పొడగింపు

image

ఐటిఐ కళాశాలలో రెండవ విడత ద్వార ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు తేదీని పొడగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్ తెలిపారు. జులై 15 వరకు గడువు ఉండగా జూలై 21 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున ఐటిఐ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ కళాశాలలో వివిధ ట్రెడ్ లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. SHARE IT

News July 18, 2024

నిర్మల్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడు మృతి చెందడంతో గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన లక్ష్మణ్‌చందా మండలంలో చోటుచేసుకుంది. రాచాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న, ఎర్రవ్వలకు ఓ కుమారుడు, ముగ్గరు కుమార్తెలు. కుమారుడు సాయన్న(40) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన అతడి తల్లికి గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.