India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ క్రమంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విలువల కంటే పీఠమే ముఖ్యమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.

ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల దృష్ట్యా సోమవారం కలెక్టర్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రజావాణి లేనందున కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని జిల్లా ప్రజలకు సూచించారు.

మున్సిపల్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు సైతం పోటీ చేశాయి. కాగా ఎవరు కూడా ఒక వార్డును కూడా గెలుచుకోలేదు. BSP పోటీ చేసిన వార్డులలో ఏడో వార్డు అభ్యర్థికి 13 ఓట్లు, 30వ వార్డు అభ్యర్థికి 93 ఓట్లు, 39 వార్డు అభ్యర్థికి 67 ఓట్లు మొత్తం BSPకి 173 ఓట్లు పొలయ్యాయి. ఇక DSP రెండు వార్డులలో పోటీ చేసింది. 6వ వార్డు అభ్యర్థికి 17 ఓట్లు 39 వార్డు అభ్యర్థికి అత్యధికంగా 368 ఓట్లు వచ్చాయి.

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్క్వార్టర్స్లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.

ADB మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తం 51 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 26 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్(11), BRS(6), MIM(6) కలిసినా మెజారిటీకి ఇంకా ముగ్గురు స్వతంత్రుల మద్దతు అవసరం. మరోవైపు స్వతంత్రులు తమ వెంటే ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పరస్పర విరుద్ధ భావజాలం గల పార్టీలు పీఠం కోసం జతకడతాయా అన్నది వేచి చూడాలి.

ఆదిలాబాద్ కువైట్లో సుదీర్ఘకాలం పనిచేసిన మెహబూబ్ 33వ వార్డులో విజయం సాధించారు. విదేశాల్లో ఉన్నప్పుడు ‘గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా భారతీయుల సమస్యలపై పోరాడారు. స్వగ్రామంపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల ఆదరణ పొందారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. సేవా దృక్పథమే తనను గెలిపించిందని మెహబూబ్ పేర్కొన్నారు.

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.