India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24న తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్కు రాకూడదని సూచించారు.
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24వ తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్కు రాకూడదని సూచించారు.
తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై శుక్రవారం అత్యాచారం చేయడంతో బాలిక తరఫు వారి ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిమ్స్ వద్ద స్థానికులు పెద్దఎత్తున గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రిమ్స్కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మావల ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దస్నాపూర్కు చెందిన విజయ్ మేస్త్రీ పనిచేసేవాడు. అతనికి అప్పు ఉండడంతో మద్యానికి బానిసగా మారాడు. ఈనెల 18న హెయిర్ కలర్ తాగగా వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్లో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బోథ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో బాల్య వివాహ ముక్త్ భారత్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోక్సో చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడారు. పిల్లలు చైల్డ్ హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వారి హక్కులకు ఎటువంటి భంగం కలిగిన ఈ 1098 నంబర్కి కాల్ చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.