Adilabad

News July 1, 2024

నిర్మల్: నూతన చట్టంలో మొదటి కేసు నమోదు: ఎస్పీ

image

దేశవ్యాప్తంగా నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండల పోలీస్ స్టేషన్‌లో సోమవారం మొదటి కేసు నమోదయిందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి ఈరోజు ఉదయం చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 1, 2024

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయాలి: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. 18 ఏళ్ల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News July 1, 2024

బేల: జాతీయ రహదారిపై టమాట లారీ బోల్తా

image

టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన బేల మండలంలోని పాటన్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల ప్రకారం.. రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఉండటంతో లారీ డ్రైవర్‌కు రాత్రిపూట కనపడక ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదు. కాగా.. టమాట లోడ్ పల్టీ కొట్టడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతు వాపోయాడు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

News July 1, 2024

నిర్మల్: ఘనా దేశంలో జిల్లా వాసి మృతి

image

నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బరిగల వెంకటేశ్(34) బతుకు తెరువు కోసం ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశ్ మృతదేహాన్నివీలైనంత తొందరగా స్వగ్రామానికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News July 1, 2024

పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్‌ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 1, 2024

భైంసా: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 1, 2024

కాగజ్‌నగర్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

image

వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలేదని ప్రజలు గుర్తించాలన్నారు.

News June 30, 2024

రేపు ఆదిలాబాద్‌లో మంత్రి పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

రాష్ట్ర పంచాయితి రాజ్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉ.9.15 ని.కు ఉట్నూర్‌లో బీటీ రోడ్ ప్రారంభిస్తారు. 9:30కు అక్కడి నుండి బయలుదేరి 10:30కు మావల అర్బన్ పార్క్‌లో వన మహోత్సవానికి హాజరవుతారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు వీల్ చెయిర్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.

News June 30, 2024

లోకేశ్వరం: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పొలీసులు వివరాల ప్రకారం.. సేవాలాల్ తండాకు చెందిన పవార్ కృష్ణ (28) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పవర్ అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ASI దిగంబర్ తెలిపారు.

News June 30, 2024

ADB: బస్సు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. CC పుటేజ్ ఆధారంగా నిర్మల్ RTC డిపోకు చెందిన బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిపై నుంచి వెళ్లడంతోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బస్ డ్రైవర్‌పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.