India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలలకు ఈనెల 27 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నట్లు DIEO జాధవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ముందుగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల కాగా, ఇప్పుడు ఒక రోజు ముందు నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు అతివలకు రెండేసి చొప్పున చీరలు ఇస్తామని నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల చీరలను ఇప్పుడు ఒకటి.. సంక్రాంతి లోపు మరొకటి ఇస్తామని పేర్కొంది. అయితే ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సిన చీరలు ఇంకా చేరుకోలేదు. జిల్లాలో 10 గోదాములను అధికారులు గుర్తించగా.. 1.48 లక్షల చీరలను ప్రభుత్వం మంజూరు చేసింది. అవి వస్తే స్వయం సహాయక సంఘాల సభ్యులకు అధికారులు పంపిణీ చేస్తారు.

ADB జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బేల 24.8 mm, ఉట్నూర్ 21.8, ఆదిలాబాద్ రూరల్ 21.3, ఇచ్చోడ 21.0, గాదిగూడ 19.3, ఇంద్రవెల్లి 19.0, తలమడుగు 18, మావల 17.3, బోథ్ 17.3, బజార్హత్నూర్ 17.0, నేరడిగొండ 17.0, తాంసి 16.8, గుడిహత్నూర్ 16.5 మిల్లీమీటర్లుగా నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించేందుకు టాయిలెట్స్, విద్యుత్, బోర్ వెల్స్ EGSలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని అన్నారు. పనులు పెండింగ్లో ఉంచకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2025-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ మద్యం (A4) దుకాణాల కేటాయింపు కోసం గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని మొత్తం మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లక్కీ డ్రా తీశారు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు ఈ లైసెన్స్లు చెల్లుబాటు అవుతాయి.

విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు SP అఖిల్ మహాజన్ సూచించారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ SP కాజల్ సింగ్ ఐపీఎస్, DSP జీవన్ రెడ్డి తదితరులున్నారు.

రోడ్ సేఫ్టీ, NCORD మాదక ద్రవ్యాల నిషేధంపై ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించడమే రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకమన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని, డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ అవగాహన చేపట్టాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 26న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఆయా కళాశాలల్లో నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్లో అత్యుత్తమ మార్పులు, నాణ్యమైన విద్యతో మంచి ఫలితాలు తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలపై చర్చిస్తామని వెల్లడించారు.

దుర్గాదేవీ నవరాత్రుల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. షీటీం, పోలీస్ పర్యవేక్షణ కొనసాగుతుందని SP అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఆకతాయిలు యువతులు, మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సమయంలోనూ ఇలా వ్యవహరించిన పదిమందిపై 1-టౌన్ PSలో కేసులు నమోదు చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరగనీయండి.. మీ తాత్కాలిక ఆనందం కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకండి.
SHARE IT

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యాయన కేంద్రాల్లో కాంటాక్ట్ పద్ధతిన కౌన్సెలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, పీహెచ్డి, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 50% మార్కులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.