India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
◾నార్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన.
◾గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
◾విషాదం.. విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
◾అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
◾ప్రధానమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
◾మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు
◾ప్రభుత్వంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫైర్
ADBలోని 1 టౌన్ PS ఎదుటనున్న ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్, శాంతినగర్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళాలు జరగనున్నాయి. ఆర్ట్స్లో అప్ గ్రేడ్ ఆధ్వర్యంలో HDFC, AXIS బ్యాంక్, ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. సైన్స్లో TSKC ఆధ్వర్యంలో TASK సహకారంతో MALE అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. నియమ నిబంధనలు పూర్తి చేయడంలో జాప్యం చేసుకోవడంతో మృతదేహం ఇక్కడికి ఇంకా చేరుకోలేదు.
జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, మెకానికల్ డిప్లమా పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు. SHARE IT.
క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అవార్డు అందుకోనున్నారు.
టీబీ నిర్మూలన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్పై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతాంగె బ్రహ్మానంద్ నియమితులయ్యారు. దీంతో ఆయన రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.