India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గతంలో డీఈవోగా పనిచేసిన టి.ప్రణీత పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే.

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి హిమశ్రీ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 26 లోపు దరఖాస్తుల సమర్పించాలని దరఖాస్తు చేసుకునేవారు రూ.లక్ష డీడీ లేదా చలాన్ గాని District Probation and Excise officer పేరిట తీసి, 3 పాస్ ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డులతో దరఖాస్తుల సమర్పించలాన్నారు. వివరాలకు 8712658771 సంప్రదించాలని కోరారు.

ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామానికి చెందిన పంద్రే విఠల్ డాక్టరేట్ పొందారు. ఈ 8డాక్టరేట్ ను రిప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ” అనే అంశంపై పరిశోధినకు గాను ఉత్తరప్రదేశ్ గ్లోకల్ విశ్వ-విధ్యాలయం” ద్వారా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ శివకృష్ణ, అధ్యాపక బృందం, బంధువులు అభినందించారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఆదిలాబాద్ పట్టణంలో నూతన ఎయిర్పోర్ట్ మంజూరు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. AIRPORT నిర్మాణానికి ప్రభుత్వం పంపిన వినతి పత్రాన్ని అంగీకరిస్తున్నామని, త్వరలో ఎయిర్పోర్ట్ వద్ద రోడ్లు, బిల్డింగ్ తదితర భవనాలను నిర్మిస్తామని పత్రంలో పేర్కొంది. దీంతో ఎయిర్పోర్ట్ కోసం పోరాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీ గోడం నగేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులు, సంఘ నాయకులకు సూచించారు. బాబూ జగ్జీవన్ రాం, బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సంబంధించి బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టరేట్లో సన్నాహక సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతి, 14న బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.