Adilabad

News June 27, 2024

ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.

News June 27, 2024

ADB: ఉదయాన్నే 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. వివరాలకు వెళ్తే.. మావల జాతీయ రహదారిపై నుంచి ఎండి అర్ఫత్, ఉస్మాన్ ప్రయాణిస్తున్న కారు ఆదిలాబాద్‌కు వస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది దీపక్, వసీం ఘటనా స్థలానికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక రిమ్స్‌లో తరలించారు.

News June 27, 2024

MNCL: బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

image

మంచిర్యాలలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ యువీఎన్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్లూరు సుధాకర్, టోర్నమెంట్ మ్యాచ్ కంట్రోలర్ కుమార్, జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

News June 26, 2024

MNCL: ‘రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణి సంస్థకే ఇవ్వాలి’

image

సింగరేణి గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే గనులను ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

News June 26, 2024

నిర్మల్: చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి

image

చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బాబాపూర్ గ్రామానికి చెందిన పడాల నాగరాజు(16) బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి పడాల గంగ నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

News June 26, 2024

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: నిర్మల్ ఎస్పీ

image

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందుకెళ్తుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల కట్టడికి పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతుందని అన్నారు. వీటి కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 8712671111, డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.

News June 26, 2024

ఆదిలాబాద్: ఈనెల 29 నుంచి పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

News June 26, 2024

ఉట్నూర్ : నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఉట్నూర్ లోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ఐటిడిఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరవీరుల స్తూపం, కేస్లాపూర్ నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించి మూడునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ రెండింటి నిర్మాణ పనులకు రూ.2కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు.

News June 25, 2024

ఆదిలాబాద్ : మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తి

image

పాలిసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 3వ రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగింది. కాగా మంగళవారం 47 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 47 మంది అభ్యర్థులు హాజరైనట్లు పాలిసెట్ కోఆర్డినేటర్ భరద్వాజ తెలిపారు. మూడురోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.

News June 25, 2024

ADB: ఆఖరి రోజు కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఈనెల 23న ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన POLYCET సర్టిఫికెట్ వేరిఫికేషన్ 3 రోజులుగా కొనసాగుతోంది. కాగా కౌన్సెలింగ్ ప్రక్రియ నేటితో ముగియనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలిసెట్ కో ఆర్డినేటర్ భరద్వాజ ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం, సోమవారం సర్టిఫికెట్‌లు సమర్పించని విద్యార్థులు నేడు తీసుకొచ్చి వేరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.