India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి జారి పడి గాయాలపాలైన ఘటన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కుందన్ పవార్ హైదరాబాద్కు వెళుతూ.. ఆదిలాబాద్ స్టేషన్లో వాటర్ బాటిల్ కోసం దిగాడు. అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ కదిలేటప్పుడు పరుగెత్తుతూ వెళ్లి ఎక్కేటప్పుడు జారి ప్లాట్ఫామ్పై పడిపోవడంతో అతని చెయ్యికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది చికిత్స అందించి రిమ్స్కు తరలించారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3న సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
వేసవి ప్రారంభంలోనే జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం బేల మండలంలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలో నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భార్య మందలించిందని ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఏఎస్ఐ ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర కిన్వాట్ తాలూకా దైహిలీకు చెందిన నూకల్వర్ ఓం ప్రకాశ్(35) మద్యానికి బానిస అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆదిలాబాద్లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
ADBలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. RR నగర్కు చెందిన వనజ శనివారం ఆటోలో ప్రయాణించి అశోక్ రోడ్డులో దిగిపోయింది. ఆటోలోనే తన బ్యాగును మరచిపోయింది. ఖానాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ జమీల్ ఖాన్ ఆటోలో బ్యాగు ఉన్న విషయం గమనించాడు. ఆ బ్యాగులో రూ.12 వేలు, 3 ఫోన్లు ఉండటాన్ని చూసి నేరుగా వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ అప్పగించగా.. సీఐ బాధితురాలి జాడ తెలుసుకొని ఆటో డ్రైవర్తో ఆమెకు బ్యాగ్ అందజేశారు.
నార్నూర్ బ్లాక్కు డెల్టా ర్యాంకింగ్ నిధుల క్రింద విద్య, ఆంగన్వాడీ సమాజ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కలెక్టరేట్లో విద్యా, మహిళా శిశుసంక్షేమశాఖ, ట్రైబల్, నీతి అయోగ్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి పనుల వివరాల ప్రపోజల్ 3 రోజుల్లో సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.