Adilabad

News June 21, 2024

బెల్లంపల్లి: మిత్రుడి తల్లి అస్థికలు కలపడానికి వెళ్లి యువకుడి మృతి

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్ అనే యువకుడు గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం మల్కల్లలోని గోదావరిలో మిత్రుడి తల్లి అస్థికలు నదిలో కలపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి ఉదయ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గజ ఈతగాళ్లు ద్వారా వెలికితీశారు.

News June 21, 2024

దిలావర్పూర్: 100 ఏళ్లకు పైబడిన మర్రిచెట్టు వద్ద వట సావిత్రి వ్రతం

image

దిలావర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం మహిళలు వట సావిత్రి వ్రతం నిర్వహించారు. 100 ఏళ్లకు పైబడిన మర్రి వృక్షం వద్ద పెద్ద ఎత్తున మహిళలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సౌభాగ్యాలను సల్లగా చూడాలని దారం చుడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా తాము ఈ వ్రతాన్ని ఆచరిస్తామని మహిళలు పేర్కొన్నారు.

News June 21, 2024

ADB: పలు RDO కార్యాలయాలకు సబ్ కలెక్టర్ హోదా

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు RDO కార్యాలయాలకు సబ్ కలెక్టర్ హోదా గుర్తింపునిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సులభతరం చేసేందకు రాష్ట్రంలో 15 RDO కార్యాలయాలకు ఈ హోదా కల్పించారు. ఉట్నూర్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ RDO కార్యాలయాలకు ఈ హోదా దక్కింది. దీంతో ఇక్కడ IAS అధికారులను సబ్ కలెక్టర్‌లుగా నియమించనున్నారు.

News June 21, 2024

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీని కలిసిన శ్యామ్‌నాయక్

image

ఆసిఫాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన SP,DV.శ్రీనివాస్ రావును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అజ్మీర శ్యాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మారుతీ పటేల్ తదితరులు ఉన్నారు.

News June 20, 2024

ఆదిలాబాద్ : POLYCET షెడ్యూల్ ఇదే.. స్లాట్ బుక్ చేసుకోండి

image

POLYCETకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటినుండి ప్రారంభం కానుంది.
★ ఈనెల 20 నుంచి 24 వరకు వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
★ జూన్ 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుంది.
★ జూన్ 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
★ జూన్ 30 న సీట్ల కేటాయింపు ఉంటుంది.
★ జూన్ 30 నుంచి జులై 4 వరకు ఫీజు చెల్లించి కళాశాల కన్ఫర్మ్ చేసుకోవాలి.
★ జులై 7 నుంచి రెండవ విడత ప్రారంభం అవుతుంది.

News June 20, 2024

BREAKING: ADB: అదృశ్యమై.. శవమై తేలిన బాలుడు

image

ఉట్నూర్ మండలంలో విషాదం నెలకొంది. శాంతినగర్ చెరువులో ఓ బాలుడి మృతదేహం గురువారం లభ్యమైంది. బాలుడు పాత ఉట్నూర్‌కు చెందిన సాయికుమార్(9)గా గుర్తించారు. ఈ నెల 16న బాలుడు అదృశ్యం కాగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యం అయిన బాలుడు నేడు శవమై కనిపించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News June 20, 2024

కలెక్టర్‌ను కలిసిన నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్‌ను గురువారం నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కౌన్సిలర్లు నరేందర్, రమణ ,నరహరి, పోశెట్టి తదితరులున్నారు.

News June 20, 2024

బాసర: 2రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

image

బాసర ఆర్జీయూకేటీ పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇప్పటి వరకు 14,500 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. జులై 3న ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 27న నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 22వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.

News June 20, 2024

ADB: ఉమ్మడి జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరం

image

రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలను కొనసాగించాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. కాగా జిల్లాలో 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.2.500 కోట్లు, రైతు భరోసా కింద 6 లక్షల మంది రైతులకు రూ.1,730.2 కోట్లు, రైతు బీమా కింద 3.09లక్షల మంది రైతులకు రూ.111.73 కోట్లు అవసరం ఉంది.

News June 20, 2024

మంచిర్యాల: ఆ SI కన్ను మహిళలపైనే.!

image

ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం SI భవానీసేన్ లైంగిక వేధింపుల కేసులో డిస్మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన SIగా ఉన్నప్పుడు ఓ యువతికి కానిస్టేబుల్ పరీక్షకు అవసరమైన పుస్తకాలు కొనిస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని సస్పెండ్ చేశారు. మంచిర్యాలలో పని చేస్తుండగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా అతడి తీరు మారలేదు.