India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD ఆస్తిపన్ను పరిధిలో భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20 వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ.2500 కోట్ల మేర రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు సమస్యలు తీర్చి, ఆస్తి పన్నును పకడ్బందీగా వసూలు చేసే విధానం పై కసరత్తు చేస్తున్నారు.
6వ తరగతి చదివే బాలికకు వివాహం జరిగిన ఘటన VKBD జిల్లా గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప.. 6వ తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. గుర్తించిన ఉపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టి యువకుడితో పాటు సహకరించిన కుటుంబీకులపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
జీహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి కూకట్పల్లి, మూసాపేట్ భరత్నగర్, రైతుబజార్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎప్పటికప్పుడు చెత్తలేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్(జివిపి)ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. వర్సిటీతో పాటు ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యాశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జులై 31 వరకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. గురువారం బంజారాహిల్స్లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి యాంటీ డ్రగ్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ విడుదల చేశారు. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్కు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
హుస్సేన్సాగర్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూ మల్లేపల్లి, గోకుల్నగర్కు చెందిన టి.మనోహర్(33) కుటుంబ సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్కు లోనయ్యాడు. నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. ఉదయం హుస్సేన్సాగర్లో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక పంపాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్లో ZCలతో సమావేశమయ్యారు. డెంగ్యూ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి శుక్రవారం Dry Day, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జోన్ల వారీగా టాక్స్ వసూలు చేసిన శాతం ప్రకారం నిధులు మంజూరు అవుతాయన్నారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొని పోలీసులకు సహకారం అందించాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా బంజారాహిల్స్లోని టీజీఎస్, సీసీ మీడియా బ్రీఫింగ్ హాల్లో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా నగరంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
చండీగఢ్, పంజాబ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరు యువకులను HYD ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్ వాసి కృష్ణ మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కంపెనీలో నెలకు రూ.70 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లాక రూమ్లో బంధించి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.
Sorry, no posts matched your criteria.