India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చండీగఢ్, పంజాబ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరు యువకులను HYD ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్ వాసి కృష్ణ మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కంపెనీలో నెలకు రూ.70 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లాక రూమ్లో బంధించి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.
నగర పరిసరాల నుంచి భారీ మొత్తంలో నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి HYD హైటెక్ సిటీలో అక్రమంగా డంప్ చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా అందరి కళ్ల ఎదుట జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యారని పేర్కొన్నారు. HYDలో నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నగర ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
HYD మియాపూర్ పీఎస్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హఫీజ్పేట్ లక్కీ హుక్కా సెంటర్లో పోలీసులు ఈరోజు తనిఖీ చేశారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్లు అమ్ముతున్నట్లు గుర్తించి సెంటర్ యజమానిని అరెస్ట్ చేశారు. 250కి పైగా హుక్కా ఫ్లేవర్లు, 150కి పైగా హుక్కా పైపులను సీజ్ చేశారు.
మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంగళరావునగర్లోని ఓ స్థిరాస్తి సంస్థలో దేవేందర్ యాదవ్(55)తోపాటు మరో మహిళ(45) ఉద్యోగం చేస్తోంది. మహిళకు సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను దేవేందర్ యాదవ్ తన సెల్ఫోన్లో తీసి పెట్టుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యోగం మానేసింది. దీంతో దేవేందర్ ఆమెకు ఫోన్ చేసి కోరిక తీర్చాలని వేధించగా.. జూబ్లీహిల్స్ PSలో ఆమె ఫిర్యాదు చేసింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో GHMC కమిషనర్ ఆమ్రపాలి శానిటేషన్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్లోని రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. GVP తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
కాళేశ్వరం పేరిట మాజీ సీఎం KCR, మాజీ మంత్రి KTR తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. KCR కుటుంబ పాలనలో అనేక స్కాములు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని NDA ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్?
ఒక నటుడిని సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD యూసుఫ్గూడ సమీపంలోని వెంకటగిరిలో నివసించే నటుడు ఎస్.రామచైతన్య(33)కు గత నెల 12న హైకోర్టు నుంచి అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీపై ఒక కేసు నమోదైందని స్కైప్ ద్వారా సైబర్ పోలీస్ కమిషనర్ అంటూ కాల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేయగా.. రూ.1.50 లక్షలు పంపించాడు. తర్వాత మోసమని గ్రహించి జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది.
ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. HYD బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఉదయ్ నగర్లో నివసించే పీ.అనురాధ(21) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నెల రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మాత్రలు ఇచ్చి సీటీ స్కాన్ తీసుకునిరావాలని సూచించాడు. అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లిన యువతి ఉరేసుకుంది. గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
GHMC నుంచి ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) డైరెక్టరేట్ వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు సంబంధిత డైరెక్టర్ పరిధిలో ఉన్న రవాణా, ప్రకటనల విభాగాలను GHMC కమిషనర్ ఆమ్రపాలి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం, రవాణా విభాగాల అదనపు కమిషనర్గా సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్ను, ప్రకటనల విభాగాన్ని అదనపు కమిషనర్ సత్యనారాయణకు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.