India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగర శివారులోని ఇక్రిశాట్ క్యాంపస్లో సోమవారం సిబ్బందికి రెండు చిరుతల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది వాటిని ఫొటో తీశారు. అయితే అవి నిజంగా చిరుతలా? లేక పెద్ద పిల్లులా? అని తేలాల్సి ఉందని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇక్రిశాట్ కమ్యూనికేషన్ హెడ్ తాహిర తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్లో 100 రోజులు 6 ప్లాట్ఫామ్లు మూసివేస్తారు. రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు.
ట్రైయిన్ల వివరాలు:
APR26:సికింద్రాబాద్-దానపూర్, హైదరాబాద్-రక్సేల్
APR28:దనాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-అగర్తల
APR29:రక్సేల్-సికింద్రాబాద్, ముజఫర్పూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రాగచి
APR30:సంత్రాగచి-సికింద్రాబాద్
MAY1:సికింద్రాబాద్-ముజర్ఫూర్
MAY2: అగర్తల-సికింద్రాబాద్
SHARE IT
HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ.200లోపు చేశారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.
HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
హైదరాబాద్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ సౌకర్యాలతో విల్లా వెర్డే ప్రాజెక్టును సైబర్ సిటీ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఇది టెర్రస్ స్విమ్ స్పాలు, బయోఫిలిక్ డిజైన్లు, IGBC-సర్టిఫైడ్ గ్రీన్ ఆర్కిటెక్చర్తో 89 బెస్పోక్ విల్లాలను కలిగిన ప్రత్యేక ప్రాజెక్టని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 20ఏళ్ల అనుభవంతో ఈ ప్రాజెక్టు అందిస్తున్నామన్నారు. ది చార్ కోల్ ప్రాజెక్టుతో కొలాబరేషన్ను ఈ లాంఛ్ ఈవెంట్లో ప్రకటించారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రెయిన్బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.