India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.98 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఫేజ్-3లోని సర్వే నంబర్లు 264 నుంచి 280 మధ్య గల 10 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో కూడిన ఈ కార్పొరేషన్ కార్యకలాపాలు త్వరలోనే సొంత భవనం నుంచి సాగనున్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.98 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఫేజ్-3లోని సర్వే నంబర్లు 264 నుంచి 280 మధ్య గల 10 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో కూడిన ఈ కార్పొరేషన్ కార్యకలాపాలు త్వరలోనే సొంత భవనం నుంచి సాగనున్నాయి.

నగరంలోని డేటా సెంటర్ల కోసం ఏటా 210 కోట్ల లీటర్ల నీరు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. తాగే నీటిని వీటికి మళ్లించడం వల్ల వచ్చే రాజకీయ వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి వెలువడే 1100 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి, నేరుగా ఈ సెంటర్ల కూలింగ్ వ్యవస్థలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల మూసీ కాలుష్యం తగ్గుతుందని <<19639510>>ప్రభుత్వం<<>> వాదిస్తోంది.

సిటీలోని భారీ డేటా సెంటర్లు నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. ఒక్క 100 మెగావాట్ల డేటా సెంటర్ రోజుకు 20 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తోంది. HMWSSB నిబంధనల ప్రకారం 13,333 మంది ప్రజల దాహాన్ని తీర్చగలదు. 40పైగా డేటా సెంటర్ల వినియోగం వల్ల దాదాపు 5.3 లక్షల మందికి సరిపడా నీరు ఈ పరిశ్రమలకే మళ్లుతోంది. రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడానికి ఇదే కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

మనోళ్లకు నచ్చితే దాన్ని ఎంతలా ఓన్ చేసుకుంటారో ఇరానీ చాయ్ చక్కటి నిదర్శనం. ఇది HYDలో ఓ అంతర్భాగం అయిపోయింది. 19వ శతాబ్దంలో పర్షియా నుంచి వలస వచ్చిన వారు ఈ రుచిని నగరానికి పరిచయం చేశారు. గంటల తరబడి మరిగే చిక్కటి పాలు, ఆవిరి బయటకు పోకుండా మరిగించే డికాషన్ కలిపి ఇచ్చే ఈ చాయ్ని పని ముగించుకొని ఇంటికి వెళ్తూ.. ఉస్మానియా బిస్కెట్తో కలిపి ఓ సిప్ వేస్తే స్ట్రెస్ అంతా స్వాహా! తలచుకుంటే నోట్లో నీళ్లూరతాయి.

ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న SRH vs RR ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మ్యాచ్ అనంతరం స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల నుంచి అన్ని రూట్లకు రైళ్లు నడపనున్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

HYD గ్లోబల్ డేటా సెంటర్లకు అడ్డాగా మారింది. దీనివెనక భయంకరమైన వాస్తవం దాగి ఉంది. AC గదుల్లో ఉండే సర్వర్ల కోసం HMWSSB కేటాయిస్తున్న నీటితో వేలాది మంది సామాన్యుల గొంతు తడపొచ్చు. కాగా, పరిశ్రమలకు ఇచ్చే సింగిల్ విండో క్లియరెన్స్లో అరౌండ్ ది క్లాక్ నీటి సరఫరా నిబంధన ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తాగునీరు అనేది పౌరుడికి మొదటి ప్రాధాన్యత. పరిశ్రమలకే ప్రాధాన్యత ఇస్తే చట్టపరమైన ఉల్లంఘన అవుతోంది.

మరణించిన వ్యక్తి ఆధార్ను డీయాక్టివేట్ చేసే విధానాన్ని UIDAI వెల్లడించింది. మీ సొంత ఆధార్ నంబర్ కానీ, కుటుంబ సభ్యులు ఆధార్ నంబర్తో My Aadhaar పోర్టల్లో లాగిన్ అయ్యి ‘Report Death Of A Family Member’ ఆప్షన్ ద్వారా మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు, డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేస్తే, పరిశీలన అనంతరం ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తారు.
Sorry, no posts matched your criteria.