Hyderabad

News September 6, 2024

HYD: రైతు సురేందర్ రెడ్డికి హరీశ్‌రావు నివాళి

image

మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

News September 6, 2024

HYD: ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

image

కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, పెంపు వ్యవహారంలో ఇంజినీరింగ్ కాలేజీలకు గురువారం హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలు పూర్తైనందువల్ల.. జేఎన్టీయూ, ఏఐసీటీఈ అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 6, 2024

HYD: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.

News September 6, 2024

HYD: నిర్మాణ ప్రదేశాల్లో ఇవి తప్పని సరి

image

ఇల్లు లేదా వాణిజ్య సముదాయాల నిర్మాణ ప్రదేశాల్లో చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని జీహెచ్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను నివారించేందుకు నిర్మాణ ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు కమిషనర్ ఆమ్రపాలి గురువారం తెలిపారు. ఇకపై జారీ అయ్యే నిర్మాణ అనుమతుల్లో ఈ నిబంధనను చేర్చాలని సూచించారు.

News September 6, 2024

గ్రేటర్‌లో కుంగిపోతున్న తాగునీటి పైపులు

image

గ్రేటర్‌లో వరద దెబ్బకు తాగునీటి పైపులు కుంగిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రహదారుల కింద ఉన్న సరఫరా లైన్లు దెబ్బతింటున్నాయి. ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు వెళ్లే సబ్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో చాలావరకు పాతబడిన లైన్లు ఉన్నాయి. వాటి మరమ్మతులకే ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రధాన నగరంలోని 169 చ.కి.మీ. పరిధిలో ఇప్పటికీ 50 ఏళ్ల నాటి వ్యవస్థ ఇప్పటికీ ఉంది.

News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

News September 6, 2024

HYD: 8 నెలల్లో.. 200 కేసులు

image

నగర సీసీఎస్ ఠాణాలో ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. రూ.250-300 కోట్ల వరకూ నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా. 30 ఏళ్లపాటు దాచిన సంపాదనను 3 రోజుల్లో పోగొట్టుకున్న వయోధికులున్నారు . ప్రీ లాంచింగ్ పేరిట స్థిరాస్తి సంస్థల ప్రకటనలతో ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా డబ్బు మీద ఉన్న ఆశతో చాలామంది మోసపోతున్నారు.

News September 6, 2024

BREAKING..HYD: గవర్నమెంట్ ఆఫీసులోనే రైతు ఆత్మహత్య

image

రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. రైతు సురేందర్ రెడ్డి (52) ఇవాళ ఉదయం అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలోని చెట్టుకు తాడుతో ఉరేసుకొని మృతి చెందాడు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 6, 2024

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా నీరజ్ అగ్రవాల్ బాధ్యతలు 

image

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

News September 6, 2024

HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

image

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.