Hyderabad

News May 6, 2024

HYD: BRS హ్యాట్రిక్ కొడుతుందా?

image

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BRS ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా నేడు చేవెళ్ల పరిధిలో KTR రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటికే KCR బహిరంగ సభ నిర్వహించారు. కాగా 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో రంజిత్ రెడ్డి BRS నుంచి గెలిచారు. ఇప్పుడు వారిద్దరూ BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి చేవెళ్లలో BRS హ్యాట్రిక్ కొడుతుందా?

News May 6, 2024

HYD: రోహిత్‌ మరణ నివేదికపై ఎమ్మెల్యే విస్మయం 

image

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోహిత్‌ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘వర్సిటీ వీసీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు.

News May 6, 2024

HYD: సీజ్ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల

image

ఆధారాలు సమర్పించడంతో రూ.4,27,98,455 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే డీజీసీ ఛైర్మన్‌ను సంప్రదించాలన్నారు.

News May 6, 2024

HYD: బెంగళూర్‌‌కు చెందిన సైబర్‌ నేరగాడి అరెస్ట్ 

image

మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ టెలీగ్రామ్‌ యాప్‌లో ప్రకటనలిచ్చి ఏడుగురి నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేసిన బెంగళూర్‌కు చెందిన ఓ సైబర్‌ నేరగాడిని HYD సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా ఏడుగురి నుంచి రూ.46.19 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత MNC కంపెనీలో ఉద్యోగమంటూ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంపించాడు. నిందితుడు బెంగళూర్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

News May 6, 2024

HYD: రేపు బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు: ఆర్.కృష్ణయ్య

image

ఈనెల 7వ తేదీన HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన బీసీ భవన్‌లో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ద్వారా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీలకు రాజ్యాంగ హక్కుల కల్పన, కుల గణన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక

image

HYD కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగినా.. పాదచారులకు ఇబ్బందులు కలిగించినా సెక్షన్ 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ DCP వినీత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదేశాలు బేఖాతరు చేస్తూ బ్రిడ్జిపై మాదాపూర్ SHO మల్లేశ్, మరో ముగ్గురు సీఐలు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News May 6, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో చెన్నై నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య గురువు కలైమామణి రోజా కణ్ణన్.. వారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలతో అలరించారు. కామాక్షి స్వరజతి, శోభిల్లు, సప్తస్వర, ఆనంద నర్తన ప్రకాశం, నను పాలింప, మాయామా, ఎందరో మహానుభావులు, మంగళం తదితర అంశాలను.. రోజా కణ్ణన్, రేవత్, అనంత కృష్ణన్, సహన, సెల్వగణేశ్, విజయరాఘవన్ మొదలైన వారు ప్రదర్శించి అలరించారు.

News May 6, 2024

HYD: కాంగ్రెస్‌‌, బీజేపీవి మాయమాటలు: పద్మారావుగౌడ్

image

కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాయమాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సికింద్రాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌లో వారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు KCR వైపే ఉన్నారన్నారు.

News May 6, 2024

HYD: చిన్నపిల్లల నీలి చిత్రాలు బదిలీ చేసిన వ్యక్తిపై పోక్సో కేసు

image

మొబైల్ ఫోన్లకు చిన్నపిల్లల నీలి చిత్రాలు షేర్ చేసి, చూస్తున్న వ్యక్తిపై HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెంగిచెర్ల మాతాఅరవింద కాలనీ వాసి మల్లికార్జునరెడ్డి(54) మొబైల్ ఫోన్‌లో తరచూ చిన్నపిల్లల పోర్నోగ్రఫీ కంటెంట్, అశ్లీల చిత్రాలను చూస్తూ షేర్ చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

నేడు సికింద్రాబాద్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్

image

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు ఆయన బైక్ ర్యాలీ చేయనున్నారు.