India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అక్కడే పునాదులు పడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల వ్యాపారానికి నాడు కేంద్ర బిందువు. ఇప్పటికీ హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే గోల్కొండ చరిత్ర ఇది. ప్రస్తుతం కోటలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది అనడానికి పైఫొటో ఒక్కటి చాలు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార వ్యర్థాలు కోటలోనే వేస్తూ కొందరు ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఇకనైనా గోల్కొండ కీర్తిని కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.
గ్రేటర్ HYD నగరంలో సుమారుగా 1.20లక్షలకుపైగా ఆటోలు ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. అయితే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలు, CNG, LPG, రెట్రో ఫిట్మెంట్ విభాగాల్లో దాదాపు 65వేలకుపైగా ఆటోలకు అనుమతులు అందజేసింది. సుమారు 20,000 వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇందులో ఉన్నాయి.
HYD త్వరలో వాట్సప్ ద్వారా GHMC ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ తదితర రెవెన్యూ బిల్లులు సైతం చెల్లించే అవకాశం ఉంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్ ఫాం సేవల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కోసం జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సహా వివిధ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.
HYD నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం మార్కెట్లో ఈ సారి రికార్డు స్థాయిలో మామిడి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సుమారు 1.43 లక్షల టన్నుల మామిడి రాకపోకలు సాగగా మొత్తం సుమారుగా సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో, బాటసింగారానికి భారీగా తరలివచ్చింది.
ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.
రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్లో పంపిణీ చేయనున్నారు.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.
HYD శివారు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో వీకెండ్ స్పెషల్ ఎంజాయ్ చేసేందుకు సువర్ణ అవకాశం. నేటి సా.5 నుంచి ఆదివారం ఉ.9:30 వరకు నేచర్ క్యాంపు ఉంటుంది. టీం బిల్డింగ్, పిచ్చింగ్, రాత్రిపూట అడవిలో వాకింగ్, నైట్ క్యాంపింగ్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రేక్కింగ్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ. మిగతా వారికి రూ.1,199 అని అధికారి రంజిత్ తెలిపారు. వివరాలకు 7382307476 నంబర్ను సంప్రదించండి.
Sorry, no posts matched your criteria.