Hyderabad

News March 30, 2025

తెలంగాణ భవన్‌లో పంచాంగం.. మళ్లీ సీఎంగా కేసీఆర్

image

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

News March 30, 2025

హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ..!

image

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 30, 2025

HYD: బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

HYDలో బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడింది. బాలానగర్ PS పరిధిలో 2022లో పోక్సో కేసు నమోదైంది. కేసు పూర్తి వివరాలు.. ఫిరోజ్‌గూడకు చెందిన బర్కత్ అలీ(21) ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. తాజాగా కూకట్‌పల్లి‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ విక్రమ్‌తో కూడిన ధర్మాసనం దోషిగా తేల్చి, 20 సం.రాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News March 30, 2025

HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

image

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

News March 30, 2025

HYD: వెల వెలబోతున్న మాంసం షాపులు!

image

మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ప్రభావం చూపుతోంది. నగరశివారు మూడుచింతలపల్లిలో చికెన్, మటన్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోయాయి. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ, ఈ ఆదివారం తెలుగు నూతన సంవత్సరం కావడంతో ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేస్తున్నారు. దీంతో నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. గిరాకీ లేదని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.

News March 30, 2025

HYD: మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్ (UPDATE)

image

అత్తాపూర్‌లో శనివారం హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ వాసి <<15926041>>పింకీ(37)<<>> అమిష్‌లోయాను ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 22న మరోసారి పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, తాను జమ చేసిన డబ్బు భర్త షేర్ మార్కెట్‌లో పెట్టి నష్టపోయాడు. ఈ మనస్తాపంతో ఆమె ఉరేసుకుంది.

News March 30, 2025

HYD: గచ్చిబౌలి, KPHBలో RAIDS

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 12 మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. AHTU DCP ఆధ్వర్యంలో కూకట్‌పల్లి, KPHB, గచ్చిబౌలి PS పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.

News March 30, 2025

HYD: హీరో ప్రభాస్ PRO పేరిట వార్నింగ్.. కేసు నమోదు

image

హీరో ప్రభాస్ PRO అంటూ తనకు కాల్ చేసి బెదిరించారని జూబ్లీహిల్స్ PSలో యూట్యూబర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు.. మార్చి 4న విజయ్‌సాధు ప్రభాస్‌కు సర్జరీ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఆ హీరో PROను అంటూ సురేశ్ అతడికి కాల్ చేసి వెంటనే డిలీట్ చేయాలని దూషించాడు. విజయ్‌సాధు వీడియో డిలీట్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులకు సురేశ్ లింక్ పంపాడు. FANS సైతం వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ పోలీసులను ఆశ్రయించారు.

News March 30, 2025

ఉప్పల్‌‌లో యాక్సిడెంట్.. లేడీ ఆఫీసర్ మృతి

image

ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ ఉద్యోగి స్వరూప రాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్‌కి చెందిన స్వరూపా రాణి(58) శంషాబాద్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిన్‌గా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శంషాబాద్‌కు వెళ్లిన స్వరూపా రాణి విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.

News March 29, 2025

HYD: ఉరేసుకొని మెహందీ ఆర్టిస్ట్ మృతి

image

రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!