India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.

చెరువు ప్రక్షాళన పనులకు సంబంధించిన ₹1.40 కోట్ల బిల్లు పాస్ చేయాలంటే కూకట్పల్లి SE చల్లా చిన్నారెడ్డి ఏకంగా ₹15 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయాడు. దుండిగల్లో బిల్డింగ్ పర్మిషన్ కోసం లక్షల్లో లంచం ఆశించిన అధికారి బుక్కయ్యాడు. ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని బండ్లగూడ ఘటన నిరూపించింది. ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ పర్మిషన్ ఫైల్ను ముందుకు కదపాలంటే <<19262574>>₹10K<<>> అడిగిన జూ.అసిస్టెంట్ శివప్రసాద్ను వదలలేదు.

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.

ప్రతాపసింగారం-ఉప్పల్ రహదారి ముత్వెల్లిగూడలో నరకకూపంగా మారింది. R&B, మున్సిపల్, HMWSSB అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమైంది. మోకాలి లోతు గుంతలు ఏర్పడినా యంత్రాంగం కళ్లుమూసుకుంది. 15 రోజులుగా కృష్ణా నీటి పైప్లైన్ లీక్ అవుతున్నా జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇరు అధికారుల బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ఠగా మారి ప్రజలకు శాపమైంది.

హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలు రాయిని చేరుకుంది. నగరవాసులకు గమ్యాన్ని సుగమం చేసిన మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 80 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసింది. 2017 నవంబర్లో ప్రారంభమైన ఈ సేవలు రోజు రోజుకీ నగర ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతిరోజూ 4.1 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ప్రతి నెలా 1.2 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.

మార్చిలో ప్రారంభమయ్యే ఎండలు నగరంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో నీటి అవసరాల సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. HYDలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు కచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాలని తెలిపారు.

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.

ఒకచోట ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మరో చోట ఇవ్వడంతో అస్వస్థతకు, ఫ్యూయిడ్లో వేరే మందు కలపడంతో కొందరు ప్రాణాలు విడిచిన ఘటనలు నగరంలో అనేకం. ఇంజెక్షన్లపై ఎక్స్పైరీతో పాటు సీసా మీద ఉండే ఈ పదాలతో ఇంజెక్షన్ ఎక్కడ వేయాలో తెలుసుకోవచ్చు.
IV అని ఉంటే నరాలకు, IM- కండరానికి, ID- చర్మం మీద, SC- చర్మం కింది లేయర్పై మాత్రమే వేయాలి. IO- బోన్ మ్యారోకి(ప్రాణాపాయ స్థితిలో అవలంభిస్తారు) వేస్తారు.
నోట్: కేవలం సమాచారం కోసమే
Sorry, no posts matched your criteria.