India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్పేట, ఖైరతాబాద్లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
సకాలంలో గణేశ్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశుడి ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజీ పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరారు.
మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక నారీ సూచీ HYDలో మహిళలకు సురక్షిత వాతావరణం నెలకొన్నట్లు తెలిపింది. అయితే.. ఎక్కువగా సూటిపోటి మాటలతో వేధింపులకు గురైనట్లు 65% మంది మహిళలు పేర్కొన్నారు. 23% మంది భౌతిక వేధింపులు, 5% మంది మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెళ్లడైంది. రవాణాలో 33%, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లోనూ 12 మంది వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
HYD జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు (MSME) డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ (ఆన్లైన్) పై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటలకు HYD కలెక్టరేట్లో పరిశ్రమల శాఖాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అలాగే బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా విక్రయ విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.
బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ చేస్తున్నట్లుగా రాష్ట్ర IPRD తెలిపింది. కేజీ వరకు బరువు కలిగిన పార్సెల్ రూ.50కు మాత్రమే HYD వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సంబంధించి ఆర్టీసీ వెబ్సైట్, ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్లను సందర్శిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
HYD శివారు బీబీనగర్ AIIMS హెల్త్ కేర్ ఫెసిలిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 84% నిర్మాణం పూర్తయినట్లుగా పేర్కొన్నారు. రూ.1365.95 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సోమవారం వివరించారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 33 విభాగాలు పనిచేస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.