Hyderabad

News September 5, 2024

HYD: AI, సైబర్ సెక్యూరిటీపై సబ్ సమ్మిట్

image

గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.

News September 5, 2024

HYD: పెరిగిన విగ్రహాల తయారీ.. తగ్గిన ధరలు?

image

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.

News September 4, 2024

నీలోఫర్ కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్

image

బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

News September 4, 2024

HYD: హైడ్రా కమిషనర్ హెచ్చరిక

image

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలా బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 4, 2024

ఖైరతాబాద్: గ్రేటర్ పరిధి విస్తరణకు తొలి అడుగు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ORR సమీపంలోని 51 గ్రామాలను మున్సిపాలిటీల్లోకి కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తరువాత మున్సిపాలిటీలనూ జీహెచ్ఎంసీలో విలీనం చేసి ‘మహా’ బల్దియాను ఏర్పాటు చేయనున్నారు, ORR లోపల, వెలుపలున్న గ్రామాలను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కసరత్తు చేశారు.

News September 4, 2024

మారేడ్‌పల్లి: నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలు

image

అవినీతికి పాల్పడటం, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులతో ఒకేసారి నలుగురు విద్యుత్తు ఇంజినీర్లపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నార్సింగి ఏఈ సందీప్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈ శివశంకర్, ఏఏఈ జ్ఞానేశ్వరావులకు మెమోలు జారీ చేశారు. ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేడ్కర్‌ను కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

News September 4, 2024

HYD: పార్కులు, ఆట స్థలాల కబ్జాపై హైడ్రా దృష్టి!

image

పార్కులు, ఆట స్థలాల కబ్జాపై అతి త్వరలో హైడ్రా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో కబ్జాల తొలగింపు తర్వాత పార్కుల ఆక్రమణలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంది. ఈ లోపు ఆక్రమణలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని లేఔట్‌లపై దృష్టి సారించింది. ఆయా లేఔట్లలో పార్కు స్థలంలో పాటు, ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలపై దృష్టి సారించనున్నారు.

News September 4, 2024

HYD: SEP-21 నుంచి కోటి మంది మహిళలకు AIలో శిక్షణ

image

కోటి మంది మహిళలకు కృత్రిమ మేద(AI)లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలతో సవిత్ ఏఐ (సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్‌ టెక్) చేతులు కలిపింది. ఈ మేరకు టీ హబ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని పత్రాలు మార్చుకున్నారు. గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, నాస్కామ్, మీటై, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (పిక్కీ ఎఫ్ఎల్), షీరోస్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సెప్టెంబరు 21 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.