India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో ఆంధ్ర-తెలంగాణ సినిమా విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ సినిమా వేదిక (TCV) గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రొపుల్ రాంరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లారా, మోహన్ బైరాగి మాట్లాడుతూ.. తెలంగాణ సినిమా పాలసీని రూపొందించాలని డిమాండ్ చేశారు. మౌనిక, అంజలి పాల్గొన్నారు.
ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ MP వి.హనుమంతరావు అన్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు, అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డా.సి.రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్పేటలోని అలీ కేఫ్ చౌరస్తా నుంచి పటేల్ నగర్ వరకు ఆయన ‘ఓట్ బచావో’ ర్యాలీని ఈరోజు నిర్వహించారు. దొంగ ఓట్లతో మోదీ పీఎం కావడం సరికాదని, ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు వేయించుకోవడం గొప్ప అని అన్నారు.
బైక్ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి(D) కొండాపూర్ PS పరిధిలో జరిగింది. SI సోమేశ్వరి తెలిపిన వివరాలు.. శంకర్పల్లి మండలం గాజులగూడ వాసి కొత్తగొల్ల రాములు(50) శనివారం పొలానికి వెళ్లి బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా గుంతపల్లి శివారులో వేగంగా వచ్చిన టిప్పర్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ ఐటీ వెళ్లే మార్గంలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. మజీద్ బండ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదని, అయితే కాస్త ట్రాఫిక్ జామవగా పోలీసులు వచ్చి క్లియర్ చేశారన్నారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నడపడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.
HYD గాంధీభవన్లో పీఏసీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఓటు చోరీపై ప్రత్యేక ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, BRS దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సీజన్లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో గణనాథుడికి స్వాగతోత్సవాలు, ఆగమన్ వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్పై వినాయక విగ్రహాన్ని తీసుకెళుతుండగా చెట్లు అడ్డుగా రావడంతో ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడింది. గాంధీనగర్ ట్రాఫిక్ పీఎస్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
వనస్థలిపురం పరిధి సహారా ఎస్టేట్ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు స్పందించి కేవలం 7 నిమిషాల్లో ఆమె ప్రాణం కాపాడారు. సూసైడ్ అటెంప్ట్ కాల్ రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, డ్రైవర్ ARPC నరేశ్ చాకచక్యంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి, హ్యాంగింగ్ చేసుకుంటున్న ఆమె ప్రాణాలను కాపాడారు. పోలీసులు సకాలంలో స్పందించడంపై స్థానికులు అభినందిస్తున్నారు.
రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందా..? లేదా..? అని తెలుసుకోవడంలో గ్యాంగ్ మెన్ కీలక పాత్ర పోషిస్తారు. కింది స్థాయి ఉద్యోగులైనప్పటికీ ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉండే ప్రమాదాన్ని గుర్తించేది వీరే. ఈ నేపథ్యంలో గ్యాంగ్ మెన్ విధులను ట్రాక్ చేయడానికి వారికి GISమానిటర్ ఏర్పాటు చేసి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామని సికింద్రాబాద్ రైల్వే GM శ్రీవాస్తవ తెలిపారు.
Sorry, no posts matched your criteria.