India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో అర్హులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 30లోపు www.nacsindia.org సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తాను మరణిస్తూ ముగ్గురు జీవితాల్లో ఓ గృహిణి వెలుగులు నింపారు. ఎల్బీనగర్ శాతవాహన నగర్ కాలనీకి చెందిన కాంతబెన్ పటేల్ 16న కళ్లు తిరిగి ఆకస్మాత్తుగా పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎల్బీనగర్లో ఓ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు ఆమె భర్త, కుమారులకు అవయవదానంపై అవగాహన కల్పించి కిడ్నీలు, లివర్ను ముగ్గిరికి ట్రాన్స్ప్లెంట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న HYD నగరంలోని హైటెక్ సిటీలోని ఓ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరపనున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్, ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పలికారు.
HYDలోని ఖైరతాబాద్ సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) డైరెక్టర్ జనరల్ బాధ్యతలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ బాధ్యతల్లో నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.
బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ డివిజన్లోని బస్తీవాసి (58) కేంద్ర ప్రభుత్వ సంస్థలో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే ఏడో తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్ల ఆశ చూపి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనెల 11న ఘటన జరగగా.. బాలిక కుటుంబసభ్యులు 13న ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
HYDలోని రాజ్ భవన్కు వచ్చిన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. గవర్నర్ దత్తాత్రేయను కలిసినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ అన్నారు. చట్టాలను అనుసరిస్తూ రాష్ట్రాలకు మంచి చేకూర్చడంలో గవర్నర్ ముఖ్యపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
హబ్సిగూడలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాలికతో పాటు గాయపడిన ఆటోడ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలు నగరంలోకి అనుమతించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
హైదరాబాద్ శివారు పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం తుఫాన్ వాహనాన్ని మరో కారు ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దీక్షిత (13) మృతి చెందింది. మరో ఇద్దరు (అర్చన, కీర్తి) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో క్రీడలకు ఆసక్తి పెంపొందించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ దోహదపడుతుంది. ఇందులో భాగంగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేట్లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
విద్యాసంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్ అరికట్టడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ HYDలో అన్నారు. తెలంగాణలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ నార్కోటెక్ తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్ పై 87126 71111 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఈ నంబర్ సేవ్ చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.