India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్లో 22 వేలు, మేడ్చల్లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.
జూబ్లీహిల్స్లోని ఇల్యూజన్ పబ్లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసేటప్పుడు భూ సమస్యలు, కోర్టులో పెండింగ్లో ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని హైడ్రా సూచించింది. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత వివాదాలు పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది.
హైదరాబాద్లో ACB అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సోమవారం GHMC రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రైడ్స్ చేశారు. ACB వివరాలు.. బిల్ కలెక్టర్ మధు ఓ పరిశ్రమకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ద్వారా రూ. 45,000 తీసుకుంటూ మధు పట్టుబడ్డాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని ACB సూచించింది.
శాసనమండలి ఎన్నిక్లలో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పోటీలో లేనందున, బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఆదివారం బీఆర్ఎస్ KCRకు ఈ మేరకు అధ్యక్షుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా పేర్కొంటూ బీసీ అభ్యర్థులకు మద్దతిచ్చి బీసీలపై తమ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్ఫోన్లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.
జీవ విజ్ఞాన రంగంలోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని హెచ్ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు సదస్సు ప్రారంభం కానుంది.
నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.
సంపూర్ణ ప్రత్యక్ష, ఆర్కెస్ట్రాతో లక్ష్య రాచప్రోలు కూచిపూడి రంగ ప్రవేశం నయన మనోహరంగా జరిగింది. రవీంద్రభారతిలో త్రిష్ట కూచిపూడి ఆరాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రముఖ నాట్య గురువు డా.అలేఖ్య పుంజాల శిష్యురాలు లక్ష్య రాచప్రోలు కూచిపూడి అరంగేట్రం చేశారు. మహాగణపతిని స్మరిస్తూ ప్రదర్శనకు శుభారంభం పలికి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సృజన అమ్మ ఆనంద గాయనితో ప్రేక్షకులను కట్టిపడేశారు.
Sorry, no posts matched your criteria.