Hyderabad

News August 21, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు SSR విడుదల

image

కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) షెడ్యూల్ విడుదల చేసిందని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బుధవారం GHMC ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు SSR నిర్వహించనున్నట్లు తెలిపారు. జులై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు.

News August 21, 2025

జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరాలి: KTR

image

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బుధవారం ఆయన్ను కార్యకర్తలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సెగ్మెంట్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని, గత BRS హయాంలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సునీతకు KTR దిశానిర్దేశం చేశారు.

News August 20, 2025

HYD: సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

image

HYD నేషనల్‌ హైవేస్‌ అథారిటీస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ను CBI అధికారులు అరెస్ట్‌ చేశారు. బీబీనగర్‌ టోల్‌ ప్లాజా పక్కన రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న యజమాని నుంచి ₹.60 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. హైవే పక్కన రెస్టారెంట్‌ నడుపుతున్నందుకు ₹.లక్ష డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. HYD,WGL, సదాశివపేటలోని దుర్గాప్రసాద్ ఇళ్లు, ఆఫీసుల్లో CBI అధికారులు సోదాలు నిర్వహించారు.

News August 20, 2025

చందానగర్: ఖజానా జ్యువెలర్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన అనీశ్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లను అరెస్ట్ చేశారు. పూణేలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పిస్టల్, 1015 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News August 20, 2025

కూకట్‌పల్లి‌‌లో 7.8 ఎకరాలకు రూ.547 కోట్లు

image

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7.8 ఎకరాల భూములు ఈ-వేలం ద్వారా రూ.547 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ.70 కోట్లు చెల్లించి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ భూములను సొంతం చేసుకుంది. అరబిందో, ప్రెస్టీజ్, అశోక బిల్డర్స్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. వేలంలో గోద్రేజ్ అధిక ధర పలికి భూములను దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

News August 20, 2025

పురానాపూల్: పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

పురానాపూల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్థానిక పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఈరోజు సందర్శించారు. డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటూనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News August 20, 2025

HYD: హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు: సీఎం

image

హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో మాట్లాడుతూ.. నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని, మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామని, రాబోయే పదేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ఎకనామీగా తీర్చిదిద్దుతామన్నారు.

News August 20, 2025

HYD: ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త: DCP

image

HYD నగర భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలను నగరంలో రెంట్ కోసం ఇచ్చే ముందు యజమానులు నిబంధనలు పాటించాలని, అగ్రిమెంట్ చేసుకోవాలని సైబర్‌క్రైమ్ DCP శిల్పవల్లి తెలిపారు. ఖాళీ చేయించాల్సిన సమయంలో రెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, కిరాయి సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవాలని సూచించారు.

News August 20, 2025

మలేరియాకు మూలాన్ని కనిపెట్టింది సికింద్రాబాద్‌లోనే

image

సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్లో పని చేసే బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1997 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని నిరూపించారు. పరిశోధనతో ఆయనను 1902లో నోబెల్ అవార్డు వరించింది. దానికి గుర్తుగా ఈ రోజును ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. నేటికి ఈ ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ చరిత్రను నెమరేసుకుంటున్నారు.

News August 20, 2025

1994- 2014 వరకు HYDను అభివృద్ధి చేశారు: సీఎం

image

1994 నుంచి 2014 వరకు HYDను సీఎంలు అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో రిజిస్ట్రార్ ఆఫీసులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర ఉందని, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారన్నారు. రాజీవ్ గాంధీ వల్లే ఐటీ రంగంలో చాలా మంది రాణిస్తున్నారన్నారని పేర్కొన్నారు.