Hyderabad

News August 11, 2024

ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి: GHMC

image

గ్రేటర్ HYD నగర ప్రజలకు జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వికారం, చలి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలని సూచించింది. ఇవన్నీ మలేరియా లక్షణాలని పేర్కొంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా కుండీలు పాత్రలో నిల్వ ఉన్న నీటిని తొలగించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 11, 2024

WOW.. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త సిస్టం ఇదే!

image

HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు రహదారుల మధ్యలో.. లేదంటే ఇరువైపులా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం సర్వీస్ మార్గాలను ఏర్పాటు చేసేందుకు వీలుందని HMDA అధికారులు తెలిపారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నాలెడ్జి సిటీ వరకు 17KM, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఆర్థిక జిల్లా వరకు 15KM, కాచిగూడ ఎంజీబీఎస్ జూపార్క్ ఎయిర్‌పోర్ట్ వరకు 20KM అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

News August 11, 2024

HYD: రాష్ట్రంలో 69 శాతం కాలేజీలు మూడు జిల్లాల్లోనే!

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోనే 109 కళాశాలలున్నాయి. అంటే 69% సీట్లు అక్కడే ఉన్నాయని అధికారులు తెలిపారు. CSE కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచ్లో రాష్ట్రంలో 69% సీట్ల ప్రవేశాలు జరిగాయని, దీంతో కోర్ బ్రాంచులకు గండిపడుతోందన్నారు. కోర్ బ్రాంచీలపై ఆసక్తి పెంచేందుకు నూతన ఆవిష్కరణలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

News August 10, 2024

HYD: బీబీనగర్ AIIMS వైద్య సేవలు రిపోర్ట్

image

HYD శివారు బీబీనగర్ AIIMS 2023-24 సంవత్సరానికి సంబంధించి 3,65,395 మంది అవుట్ పేషెంట్లు, 7,953 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 750 పడకల సామర్థ్యం ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం 20 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ వంద మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు.

News August 10, 2024

HYD: ఆశలన్నీ.. ఆగస్టు నెల పైనే..!

image

HYD, RR, MDCL, VKB ప్రాంతాల ప్రజలు ఆగస్టు నెల పైన ఆశలు పెట్టుకున్నారు. జూన్, జులై నెలల్లో పెద్దగా భూగర్భ జలమట్టాలు పెరగలేదు. 250 ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన ఫీజోమీటర్ తనిఖీల్లో HYD జిల్లాలో మేలో 9.42 మీటర్ల లోతుకు పడిపోతే, జూన్లో 8.56 మీటర్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు రంగారెడ్డిలో మే నెలలో 14.06 నుంచి జూన్లో 13.99, మేడ్చల్ జిల్లాలో 13.99 నుంచి 12.89 మీటర్లకు స్వల్పంగా పెరిగాయి.

News August 10, 2024

HYD: 3 వేల మంది నిపుణులతో హైటెక్ సిటీలో హబ్

image

HYDలోని హైటెక్ సిటీలో అమింగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపుగా 3000 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటా సెన్స్, లైఫ్ సైన్సెస్ లాంటివి అనేక డిజిటల్ అంశాలపై బయోలాజికల్ సంస్థ సేవలు అందించనుంది. వరల్డ్ క్లాసు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.

News August 10, 2024

HYD: సైరన్లతో ఫేక్ అంబులెన్స్‌లు.. తనిఖీలు!

image

HYD మహా నగరంలో సైరన్లతో వెళ్లే ఫేక్ అంబులెన్స్‌లపై అధికారులు ఫోకస్ పెట్టారు. బోయిన్‌పల్లి మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు ప్రవేశించిన పలు జిల్లాలకు చెందిన ఫేక్ అంబులెన్స్‌లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. 38కి పైగా సైరన్ మోగిస్తూ ఫేక్ అంబులెన్స్ వాహనాలను అధికారులు గుర్తించారు.

News August 10, 2024

HYD: సయ్యద్ అబ్దుల్ రహీం ఎవరో తెలుసా..?

image

గ్రేటర్ HYD పరిధిలో మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం 1950 నుంచి 1963 వరకు భారత్ ఫుట్ బాల్ టీమ్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ కాలం భారత ఫుట్ బాల్ క్రీడకు స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. సయ్యద్ అబ్దుల్ రహీం ఫుట్ బాల్ క్రీడకు చేసిన సేవలు ఇతివృత్తంతో ఇటీవల మైదాన్ సినిమా సైతం తీశారు. కాగా తాజాగా ఫుట్ బాల్ మైదానాల ఏర్పాటుకు GHMC రంగం సిద్ధం చేయడంతో మళ్లీ మన HYD ఫుల్‌బాల్ క్రీడలో దూసుకుపోనుంది.

News August 10, 2024

HYD: అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత పోస్టులు.. నిందితుడి ARREST

image

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వికారాబాద్‌కు చెందిన విజయ్‌ను HYD సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించి కించపరిచేలా పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరించారు.

News August 10, 2024

HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

image

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.