Hyderabad

News August 15, 2025

HYD: తాగునీటి సరఫరా చేసే ముందు పరీక్షలు చేయాలి: MD

image

HYDలో తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ముందు క‌చ్చితంగా నాణ్య‌త‌ను ప‌రీక్షించాల‌ని అధికారుల‌ను జలమండలి MD అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎక్క‌డా తాగునీరు క‌లుషితం కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. బ‌స్తీలు, లోతట్టు ప్రాంతాలపై మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. క్లోరిన్ బిల్ల‌ల‌ను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.

News August 15, 2025

HYD: స‌హ‌జ‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి ల‌క్ష్యం కావాలి: కమిషనర్

image

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.

News August 15, 2025

ఎల్బీనగర్‌‌లో శ్రీకాంతాచారికి నివాళులు

image

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఈరోజు HYD ఎల్బీనగర్‌ చౌరస్తా సమీపంలోని ఆయన విగ్రహానికి BRS నేతలు ఘనంగా నివాళులర్పించారు. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

News August 15, 2025

సైబరాబాద్ కమిషనరేట్‌ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు గచ్చిబౌలి పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన అపారమైన త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.

News August 15, 2025

HYD: జలమండలి ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎండీ అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వినియోగదారులు, ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్లు సుదర్శన్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2025

HYD: మరో 13 చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్రణాళిక.!

image

సిటీలో హైడ్రా 6 చెరువుల అభివృద్ధిని చేప‌ట్టింది. అంబ‌ర్‌పేట‌ బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధ‌రించి, అక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు ప‌లుమార్లు సంద‌ర్శించి అక్క‌డ హైడ్రా చ‌ర్య‌లను అభినందించాయి. మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది.

News August 15, 2025

HYD: పోలీసులకు గుడ్‌న్యూస్

image

గ్రాడ్యుయేషన్ లేని పోలీసులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. SSC, ఇంటర్ పూర్తిచేసిన కానిస్టేబుళ్లు డిగ్రీ చేయవచ్చు. ఈ మేరకు ఓపెన్ యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. 40 సంవత్సరాలలోపు ఉన్న కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఈ ఛాన్స్ కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన సబ్జెక్టులలో డిగ్రీ చేయవచ్చు. దాదాపు 120 సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.

News August 15, 2025

HYD: హైడ్రాపై దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టండి: రంగనాథ్

image

హైడ్రాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా తమ కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News August 15, 2025

గోల్కొండ‌లో పంద్రాగస్టు వేడుకలు.. CM రాకతో బందోబస్తు

image

పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు CM రేవంత్ రెడ్డి జెండా ఎగరేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచే రాందేవ్‌గూడ-గోల్కొండ కోట రూట్‌లో వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరికాసేపట్లో CM కోటకు చేరుకోనున్నారు.

News August 15, 2025

HYD: శ్రీకాంతా.. నీ అమరత్వం మరువం!

image

ఓ వైపు శరీరాన్ని మంటలు దహించివేస్తోన్న ఆ ఉద్యమకారుడి గొంతులో తెలంగాణ నినాదం ఆగలేదు. స్వరాష్ట్రం కోసం 2009 NOV 29న LBనగర్‌ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మహుతితో ఉమ్మడి రాష్ట్రం ఉలిక్కిపడింది. గురిచేసింది. జనం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అంటూ 5 రోజులు మృత్యువుతో పోరాడాడు. స్వరాష్ట్రం కోసం పరితపించి, ప్రాణాలు విడిచిన శ్రీకాంతాచారి జయంతి నేడు.
అమరుడా నీకు జోహర్లు.