Hyderabad

News July 27, 2024

HYD: హైటెక్‌సిటీని అమ్మేవారు: డిప్యూటీ సీఎం

image

కాంగ్రెస్ ముందుచూపుతోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ECIL, NFC వంటి కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో‌ను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కూడా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. BRS చేసిందేమీ లేదన్నారు. చాలా వరకు అమ్ముకున్నారని.. వదిలేస్తే హైటెక్‌సిటీని అమ్మేవారని భట్టి మండిపడ్డారు.

News July 27, 2024

HYD: మెడికల్ కాలేజీకి తల్లి మృతదేహం దానం

image

ప్రగతినగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందారు. శనివారం ఆమె భౌతికదేహాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వచ్ఛందంగా మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు దానం చేశారు. మరణించిన తర్వాత దహనం చేయడం, సమాధి చేయడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం మేలు అని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మెడికల్ కళాశాల డీన్ హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ నవీన్ వెల్లడించారు

News July 27, 2024

HYD: KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: MLA

image

నాటి KCR పాలనలో బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి, తెలంగాణ ప్రజల్లో ధైర్యం నూరిపోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ VKB జిల్లా చీఫ్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ బిల్లు పాసైన రోజు పార్లమెంట్‌లో KCR లేరని, విజయశాంతి ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిపోయారని అన్నారు. KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ మిత్ర కూటములంతా కలిసి సోనియాగాంధీని ఒప్పించడంతో వచ్చిందన్నారు.

News July 27, 2024

గ్రేటర్‌ పరిధిలో 8 ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్స్‌ ఏర్పాటు

image

కొత్తగా ఏర్పాటు చేసిన సెక్షన్‌ కార్యాలయాల పరిధిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, అత్యవసర మరమ్మతులు నిర్వహించేలా ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్స్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తూ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశాలు చేశారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న 10 సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో ఇప్పటికే 205 ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్స్‌ (ఎఫ్‌ఓసీ) ఉండగా, కొత్తగా మరో 8 ఎఫ్‌ఓసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

News July 27, 2024

అందుకే HYD ప్రజలు BRSను గెలిపించారు: హరీశ్‌రావు

image

BRS పాలనలో HYDలో అభివృద్ధే జరగలేదని కాంగ్రెసోళ్లు అంటున్నారని, దాని గురించి మాట్లాడాలంటే 10 పేజీలు ఉన్నాయి చెప్పమంటారా అని MLA హరీశ్ రావు ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేశాం కాబట్టే హైదరాబాద్ ప్రజలు నిండు మనసుతో KCRను అశీర్వదించి దాదాపు అన్ని సీట్లలో BRSను గెలిపించారని అన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా HYDఅభివృద్ధి విషయంలో KCRను కొనియాడారని గుర్తు చేశారు.

News July 27, 2024

HYD: HMWSSB ప్రక్షాళనతో బదిలీలు!

image

HYDలోని HMWSSB ప్రక్షాళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనరల్ మేనేజర్లు రవీందర్ రెడ్డి, సుబ్రమణ్యం, మహేందర్, సంతోశ్ కుమార్, సుబ్బా రాయుడు, సాయి లక్ష్మి, సీహెచ్ శ్యాంసుందర్ నాయక్, తిప్పన్న, సత్యనారాయణ, మరియారాజ్, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని బదిలీ చేస్తున్నారు.

News July 27, 2024

చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపాం: CM

image

అసెంబ్లీలో KCRపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నాడు రాజశేఖర్ రెడ్డిని నాటి సభ్యులు ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొద్దామనుకుంటే దానిని KCR మెదక్ వరకు నియంత్రించారని ఆరోపించారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా చూశారు కానీ చేవెళ్ల, VKB, తాండూరు, పరిగి, కొడంగల్‌కు నీళ్లు ఇవ్వలేదని, RRజిల్లాను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తుంటే చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపామన్నారు.

News July 27, 2024

HYD: మా MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మొత్తుకుంటారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెబుతున్న KCR.. RR జిల్లాలో ఎన్ని భూములు అమ్ముకున్నారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. గత BRS పాలనలో RRలో కనీసం డ్రైనేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి నిధులివ్వలేదని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ఎప్పుడూ మొత్తుకుంటారని అన్నారు.

News July 27, 2024

HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

శామీర్‌పేట్‌లో శుక్రవారం <<13709545>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. హకీంపేట వాసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శేఖర్(25), మౌలాలి వాసి, ఐటీ ఉద్యోగి దీపిక(23) ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి HYD వైపు రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. తుర్కపల్లి సమీపంలో కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఎదురుగా వచ్చే బస్సును, బైక్‌ను ఢీకొట్టారు. శేఖర్, దీపిక చనిపోగా బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.

News July 27, 2024

HYD: చాక్లెట్‌లో ఈగ.. షాక్!

image

HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.