India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సృష్టి అక్రమ సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వైజాగ్ కింగ్ జార్జ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రమ్య ఉన్నారు. వీరంతా ప్రధాన నిందితురాలు నమ్రతకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 25కు చేరింది.
బండ్లగూడ పీఎస్ పరిధిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇండియా చూపిస్తామంటూ బంగ్లాదేశ్ బాలికను నమ్మించి తీసుకొచ్చిన ముఠా సభ్యులు మెహదీపట్నంలోని ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి, ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని తెలిపారు.
దక్షిణ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ రోబోట్ కాంపిటీషన్లో మౌలాలి గాయత్రీ నగర్కు చెందిన వంటేరు వేదాన్ష్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించాడు. 9వ తరగతి చదువుతున్న వేదాన్ష్ అండర్-14 విభాగంలో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచే రోబోటిక్స్లో పలు బహుమతులు గెలుచుకున్న వేదాన్ష్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.
బోనాల వేడుకలు ముగిసి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ఆలయాలకు ప్రభుత్వం నుంచి నిధులు అందలేదని ఆలయ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేడుకల కోసం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా HYD, సికింద్రాబాద్, RR పరిధిలోని చాలా ఆలయాలకు నిధులు అందలేదని వారు చెబుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటివరకు వివరాలను కలెక్టరేట్కు పంపకపోవడంతో వందలాది ఆలయాలకు చెక్కులు ఆగిపోయాయని సమాచారం.
జూబ్లీహిల్స్ టికెట్ అన్ని ప్రధాన పార్టీలు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మాగంటి గోపీనాథ్ మృతి వల్లే ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకుంటామన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లో తమ సామాజిక వర్గానికి చెందిన వారు 50 వేల మంది ఉంటారని నాయకులు తెలిపారు.
ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళ్లే మార్గంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను ఘట్కేసర్కు విస్తరించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరానికి తూర్పున వరంగల్ హైవే వైపు అభివృద్ధి మరింత జరగాలంటే మెట్రోతో పాటు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు చేస్తున్న కృషికి ఆమెకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ప్రియాంకా గాంధీతో ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ ఎవరికనేది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నుంచి ఆశావహులు మంత్రుల వద్ద మంతనాలు మొదలుపెడితే, BRS టికెట్ కోసం కొందరు KTRను సంప్రదించినట్లు టాక్. కొసమెరుపు ఏంటంటే మాగంటి ఇంటి నుంచే ఇద్దరు పోటీకి రెడీ అయ్యారు. తమకే టికెట్ అని ఒక్కరిద్దరు బహిరంగ ప్రకటన చేశారు. మొత్తంగా ప్రధాన పార్టీల్లో టికెట్ ఫైట్ మొదలైంది. అవకాశం ఎవరికిస్తారో అనే కుతూహలం ఆశావహుల్లో గుబులు రేపుతోంది.
2025 మొదటి అర్ధవర్షంలో విశిష్ట సేవలందించిన 446 మంది సిబ్బందికి హైదరాబాద్ సిటీ పోలీస్ మెగా రివార్డ్స్ ప్రదానం చేసింది. బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా పలు విభాగాల ఉద్యోగులు అవార్డులు అందుకున్నారు. శాంతి భద్రతకు పోలీసుల కృషి ప్రశంసనీయం అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
హైదరాబాద్ సిటీ ఇన్నొవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITI), స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP) పనులకు GHMC అధికారులు IIT, NIT ఇంజినీర్ల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి ఇంజినీరింగ్ మేధస్సును ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలని GHMC భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.