Hyderabad

News July 20, 2024

HYD: టీ కోసం వెళ్లి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దుర్మరణం (UPDATE)

image

దుండిగల్‌ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. VNR విజ్ఞాన్‌ జ్యోతి‌ కాలేజీలో అక్షయ్, అశ్విత్, నవనీత్, జస్వంత్‌ బీటెక్‌ ఫస్టీయర్ చదువుతున్నారు. మరో ఫ్రెండ్‌ హరితో కలిసి ORRవైపు టీ తాగేందుకు వెళ్లారు. ORR సర్వీస్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న వీరి కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో‌ అక్షయ్, అశ్మిత్, హరి దుర్మరణం చెందారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.

News July 20, 2024

HYD: సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ

image

నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండలోని సమస్త కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. SHARE IT

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు స్పెషల్ బస్సులు

image

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News July 19, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక

image

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెహికల్ ఓనర్‌తో పాటు తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల HYD శివారులోని శంకర్‌పల్లిలో బాలుడు (16) స్నేహితులతో కలిసి కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తు చేశారు. దీంతో కారు యజమాని, తండ్రిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. SHARE IT

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం

image

HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు‌ రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్‌ MLA పద్మారావు‌ గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్‌ బోనాలకు‌ వచ్చే కేసీఆర్‌, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.

News July 19, 2024

HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు

image

అసభ్యంగా ప్రవర్తించాడని‌ ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్‌నగర్‌లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్‌బిహేవ్ చేశాడని‌ విచక్షణ రహితంగా దాడి చేయడంతో‌ చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.

News July 19, 2024

HYD: రాచకొండ పోలీసుల కష్టాలు

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు (AR) విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఖైదీలను రంగారెడ్డి జిల్లా కోర్ట్‌లో హాజరుపరుస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు కనీస వసతులు కూడా లేక ఇలా రోడ్ పైనే భోజనం చేస్తున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో పోలీసులకు డైనింగ్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతున్నారు.

News July 19, 2024

బీజాపూర్ హైవేపై 18 అండర్ పాసులు

image

ఔటర్ రింగురోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ గల మార్గంలో మొత్తం 18 అండర్పాస్ నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఈ 2 గ్రామాలు విస్తరించి ఉండడంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎక్కువగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.

News July 19, 2024

హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

image

నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.