Karimnagar

News September 1, 2025

కరీంనగర్: ప్రజావాణికి 269 దరఖాస్తులు

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 269 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలోని అన్ని పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

News September 1, 2025

కరీంనగర్ ముదిరాజ్ సమస్యలపై నీలం మధుతో సమావేశం

image

హైదరాబాద్ పటాన్‌చెరులోని నీలం మధు నివాసంలో కరీంనగర్ జిల్లా TMPS నాయకులు ఆయనను కలిశారు. కూనచల మహేందర్, కీసర సంపత్, పెసరు కుమారస్వామి, అరిగే ప్రభాకర్, జోడు బాలరాజు, భూమ ప్రవీణ్ పాల్గొన్న ఈ సమావేశంలో ముదిరాజ్ సమాజ సమస్యలు, సంక్షేమం, రాజకీయ అభివృద్ధిపై చర్చించారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

News September 1, 2025

KNR: ‘పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు’

image

జిల్లా కలెక్టరేట్ ఎదురుగా KNR ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, టిషర్ట్లు ధరించి నిరసన కార్యక్రమంలో‌ పాల్గొన్నారు. JAC చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని అన్నారు. 30–35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదన్నారు.

News September 1, 2025

కరీంనగర్ జిల్లాకు మొండిచేయి

image

సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు (నంబరు 20101/02)కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో కూడా హాల్టింగ్ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో హాల్టింగ్ కల్పిస్తే.. HZBD, HSNB, పరకాల, భూపాలపల్లి, మానకొండూరు ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చొరవ చూపాలని కోరుతున్నారు.

News September 1, 2025

కరీంనగర్: ‘సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి’

image

కరీంనగర్‌లో ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

News August 31, 2025

కరీంనగర్‌కి గర్వకారణం.. జాతీయ అవార్డు పొందిన రామకృష్ణ, సునీత

image

ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.

News August 31, 2025

KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

image

కరీంనగర్‌లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

News August 31, 2025

KNRలో గిరిజన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

image

HYDలో జరిగే చర్చా గోష్టికి వెళ్తున్న గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, శివరాజులను కరీంనగర్‌లో పోలీసులు ఆదివారం హౌస్ అరెస్టు చేశారు. దీంతో గిరిజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా, లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసిన సోయం బాపూరావు, వెంకటరావులను అరెస్టు చేయకుండా తమను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.

News August 31, 2025

KNR: మహిళల పాత్ర అత్యంత కీలకం: మౌలానా

image

KNRలోని నేషనల్ ఫంక్షన్ హాల్‌లో సిటీ జమాత్ ఉలమా ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ రసూల్ సభలో ప్రధాన వక్తగా హజ్రత్ మౌలానా అతిఖ్ అహ్మద్ ఖాస్మి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ,, కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దైవ ప్రవక్త బోధనలు అమలుపరిస్తేనే సమాజంలో శాంతి, న్యాయం, ఐక్యత సాధ్యమవుతుందని వివరించారు. మహిళలు తాలీం (విద్య), తర్బియత్ (పరిగణన, ఆచరణ) విషయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

News August 31, 2025

KNR: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైజ్ఞానిక అధ్యయన తరగతులు

image

ఉమ్మడి KNR, NZB జిల్లాల జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో KNRలోని ఫిల్మ్ భవన్‌లో ఆదివారం అధ్యయన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామచంద్రయ్య ‘శాస్త్రం, శాస్త్ర ప్రచారం, సవాళ్లు’ అంశంపై ప్రసంగించారు. రాజా రాజా ‘ప్రజా సైన్స్ ఉద్యమం, తాత్వికత, అనుభవాలు’ పంచుకోగా, చెలిమెల రాజేశ్వర్ జెవివి కార్యక్రమాలు, పర్యావరణ స్పృహపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెవివి ఆశావహులు పాల్గొన్నారు.