Karimnagar

News June 26, 2024

హుజూరాబాద్: అవమానంతో వివాహిత సూసైడ్

image

హుజూరాబాద్ (M) ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన నాగరాజుతో సంబంధం పెట్టుకుందని అతడి భార్య ఉమ, సోదరి తిరుమల, రాజ్‌కుమార్ ఆమెపై దాడి చేశారు. అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ పేర్కొన్నారు.

News June 26, 2024

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం(M) మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. MNLC డిపోకి చెందిన బస్సు దర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25)HYD, అఫ్జల్(55)GDK క్యాబిన్‌లో ఇరుక్కొని చనిపోయారు. PDPL CI కృష్ణ, ధర్మారం SI సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News June 26, 2024

KNR: ఈ నెల 29న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

image

ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో‌ ఉన్నారు. ఇందులో భాగంగానే‌ ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.

News June 26, 2024

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకేపీ సీసీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులున్నారు.

News June 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరిఖనిలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాల సీజ్. @ ధర్మారం మండలంలో ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీ.. ఇద్దరు మృతి. @ కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనకి చేసిన ఎస్పీ. @ రాయికల్ మండలంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ మెట్పల్లి మండలం మేడిపల్లిలో 2 ఇళ్లలో చోరీ.

News June 25, 2024

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకేపీ సీసీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులున్నారు.

News June 25, 2024

అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: కరుణ

image

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్, తాగునీరు, టాయిలెట్, వసతులు కల్పించాలన్నారు. జులై మొదటి వారం నాటికి అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య బోధనపై శిక్షణ పూర్తి చేయాలన్నారు.

News June 25, 2024

క్లాస్ రూమ్‌ను ప్రారంభించిన పమేలా సత్పతి, మంచు లక్ష్మి 

image

కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్(పోచంపల్లి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్‌ను కలెక్టర్ పమేలా సత్పతి,  సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభాషను మరవొద్దని, ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలని సూచించారు. 

News June 25, 2024

ముస్తాబాద్: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి

image

ముస్తాబాద్ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన పెంట చందు(23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు అనే భయంతో సోమవారం వీరిద్దరూ కలిసి కరీంనగర్‌లోని ఉజ్వల పార్కులో పురుగు మందు తాగారు. చందు మృతిచెందగా యువతి ఎల్లారెడ్డిపేలలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

News June 25, 2024

బండి సంజయ్‌ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో సోమవారం ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. పదేళ్లలో తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయసహకారాలు అందించాలని కోరారు. స్పందించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అండగా ఉంటామని చెప్పారని తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.