India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా పత్తి రైతులకు సీసీఐ వారు కాపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసి పత్తిని అమ్ముకొనే క్వింటాళ్ల నిబంధనలో మార్పు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకొన్న రైతులు గరిష్టంగా అదనంగా 5 క్వింటాళ్ళ పత్తిని విక్రయించడానికి అనుమతి ఇవ్వడమైనది. రైతులు పత్తి పరిమాణాన్ని నమోదు చేసుకొని పత్తి కొనుగోళ్ళకు సహకరించాలని కోరారు.

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

హైదరాబాద్లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్, భువన్ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్ బ్యాక్స్ట్రోక్ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, కోచ్లు అభినందించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. కనీసం 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆర్.బి.ఎస్.కె పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనం, శిశుగృహ సంరక్షణ కేంద్రాలను జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. పిల్లలకు అందుతున్న భోజన, విద్యా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్ అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. చిన్నారుల సంరక్షణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సూచించారు. జిల్లా న్యాయ సేవా సాధికారత విభాగం సూపరింటెండెంట్ సుజాత ఉన్నారు.

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. KNR-JGTL రహదారిపై చెట్లకొమ్మలు విస్తరించడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులకు దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి, గత ఏడాది మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

KNR(D) SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు తరగతులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని, ఫీజు రూ. 2,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కామాద్రి కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.