Karimnagar

News August 27, 2024

KNR: ఆ గ్రామంలో ఆదివారం నాన్ వెజ్ బంద్!

image

సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా.. చాలా మందికి ఆదివారం మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్తులు కాస్త భిన్నంగా ఉంటారు. ప్రతి ఆదివారం కేవలం శాఖాహార భోజనం మాత్రమే తింటారు. మద్యానికి దూరంగా ఉంటారు. మల్లన్నస్వామి ప్రీతికరమైన ఆదివారం మాత్రం నిష్టతో ఉంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.

News August 27, 2024

కరీంనగర్: ముస్తాబవుతున్న బొజ్జ గణపతి విగ్రహాలు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోసం నెలరోజుల ముందునుంచే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను మండపంలోనే తయారు చేస్తున్నారు. రామ్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న మండపాన్ని మిత్ర యూత్ అత్ ముప్పై ఒక్క అడుగుల బొజ్జ గణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలను అమర్చి చూపరులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 27, 2024

భీమన్న ఆలయంలో మహా లింగార్చన పూజ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస 4వ సోమవారం సందర్భంగా సాయంత్రం భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు గావించారు. స్వామివార్లను రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేసి.. పరివార దేవతార్చన పూజలు సైతం చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.

News August 26, 2024

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: ఎస్పీ

image

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. నేడు మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలాలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

సిరిసిల్ల: ఈసారి సాధారణ వర్షపాతమే!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 576.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 719.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 7 మండలాల్లో ఉంది. 60 శాతంగా నమోదైన మండలాలు 6 ఉన్నాయి.

News August 26, 2024

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు!

image

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ఊరించినప్పటికి, జిల్లాలో కనీసం 1000 మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించలేదు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి 8 మాసాలు గడవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా జిల్లా వ్యాప్తంగా 1,85,404 దరఖాస్తుల వచ్చాయి. మొదటి విడతలో జిల్లాకు 10,500 ఇళ్లను కేటాయించారు.

News August 26, 2024

కరీంనగర్: పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

image

జగిత్యాల-వరంగల్ ఎన్‌హెచ్ 563 రహదారి నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసిన అధికారులు రైతులకు నష్టపరిహారం ఇంకా అందించలేదు. గత రెండు సంవత్సరాల క్రితం రహదారి పనులు ప్రారంభం కాగా భూ సేకరణ చేసిన అధికారులు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. కొందరి బావులు ఈ రహదారి కింద పోతుండగా ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం చెల్లిస్తే ముందస్తుగా మళ్లీ బావులను తవ్వుకుంటామని, వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News August 26, 2024

అంజన్న భక్తులకు భారం కానున్న పార్కింగ్

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థాన కొండపైన వాహనాల పార్కింగ్ రుసుము వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బస్సు, లారీ రూ.50, కారు, జీపు రూ.40, ఆటోకు రూ.30, బైక్‌ రూ.10 వాహన రుసుముగా అధికారులు నిర్ణయించారు. పార్కింగ్‌కు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలపకుండానే పార్కింగ్ రుసుము ప్రవేశ పెట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.