Karimnagar

News April 9, 2025

జగిత్యాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే

image

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

News April 8, 2025

KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్

image

జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదామ్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నామన్నారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరాతీశారు.

News April 8, 2025

KNR: శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలి: కలెక్టర్

image

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యాసంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్‌లో శిక్షణ ఇప్పించారు. ఈ పరీక్ష రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు ఈరోజు మెడల్స్, సర్టిఫికెట్స్ కలెక్టర్ అందజేశారు.

News April 8, 2025

కొండగట్టులో నాసిరకం ప్రసాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పులిహోర, అన్న ప్రసాదంలో నాసిరకం సరకులు వినియోగిస్తున్నారని కొండగట్టు మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోచమ్మల ప్రవీణ్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రానున్న హనుమాన్ జయంతికి లక్షలాదిమంది వస్తుండగా వారికి నాసిరకం వస్తువులతో తయారు చేసిన పులిహోర, లడ్డు, అన్నప్రసాదం అందజేస్తే ఆలయ ప్రతిష్ఠ దిగజారే అవకాశం ఉందన్నారు.

News April 8, 2025

శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

image

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

News April 8, 2025

PDPL: కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43) దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.

News April 7, 2025

KNR: ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

image

ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 881 మంది విద్యార్థులకు 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News April 7, 2025

ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

image

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 40.1°C నమోదు కాగా, ఇల్లందకుంట, గంగాధర 40.0, జమ్మికుంట, మానకొండూర్ 39.9, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ 39.8, కరీంనగర్ రూరల్ 39.5, హుజూరాబాద్ 39.4, వీణవంక 39.2, కరీంనగర్ 38.9, రామడుగు 38.8, చొప్పదండి 38.5, కొత్తపల్లి 38.3, గన్నేరువరం 38.2°C గా నమోదైంది.